గుంటూరు ఆస్పత్రిలో కరోనా ఇంజెక్షన్లు చోరీ .. ఎవరు చేసారంటే ?

Update: 2020-09-22 10:30 GMT
కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇక ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 631749 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక దీనికి ఇప్పటికి కూడా సరైన వ్యాక్సిన్ ఇంకా లేదు. దీనితో రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ లో కూడా బెడ్స్ నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే , తాజాగా గుంటూరు జీజీహెచ్‌ లో దొంగతనం జరిగింది. కరోనా భాదితులకు ఇవ్వడానికి  తీసుకువచ్చిన ఖరీదైన ఇంజక్షన్లను అక్కడ పనిచేసే సిబ్బంది మాయం చేశారు. దీంతో గుంటూరు జీజీహెచ్‌ లో ఔషధాలకూ భద్రత లేదని రోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆస్పత్రి మెడికల్‌ స్టోర్‌ విభాగానికి వార్డుబాయ్‌ ఒకరు ఆదివారం వెళ్లి అక్కడ పని చేసే ఉద్యోగుల కళ్లుగప్పి ఖరీదైన ఇంజెక్షన్లతో కూడిన బాక్సును పట్టుకుపోయాడు. ఆ ఇంజక్షన్లను ఓ మెడికల్‌ స్టోర్‌ లో అమ్మేశాడు. ఆ చోరీతో హాస్పిటల్ వర్గాలకి షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో మెడికల్‌ స్టోర్‌ విభాగం అత్యంత కీలకమైనది. ఖరీదైన మందులను స్ట్రెచర్లు, చక్రాల కుర్చీల్లో పెట్టుకుని ఇక్కడ నుంచి వార్డుబాయ్ ‌లు, స్టాఫ్‌ నర్సులు తీసుకెళ్తారు. అయితే ఈ స్టోర్‌ లో సీసీ కెమెరాలను ఎక్కడా ఏర్పాటు చేయలేదు. మెడికల్‌ స్టోర్స్‌ నుంచి వార్డు బాయ్‌ ఇంజెక్షన్ల బాక్సును బయటకు తీసువెళ్లే వరకు అటు భద్రతా సిబ్బంది, ఇటు మెడికల్‌ స్టోర్‌ సిబ్బందికి తెలియకపోవడం గమనార్హం.

అయితే వార్డు బాయ్‌ పట్టుకు పోయిన ఇంజెక్షన్ల బాక్సును లోకల్‌ పర్ఛేజస్‌ కింద ఈ మద్యే హాస్పిటల్ కి  తెప్పించారు. ఒక్కో ఇంజెక్షన్‌ ధర బయట మార్కెట్లో రూ.5 వేలకు పైగా ఉంటుంది. ఇంత ఖరీదైన మందుల నిల్వలను స్టోర్‌ ఉద్యోగులు నిర్లక్ష్యం గా ఆరు బయటే పెట్టి ఉంచడం గమనార్హం. దీనిపై జీజీహెచ్ పర్యవేక్షకురాలు ఆచార్య ప్రభావతమ్మ కూడా స్పందించారు. దొంగతనానికి  పాల్పడిన వార్డు బాయ్ ‌ను సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందో నివేదిక ఇవ్వాలని విచారణకు ఆదేశించమని చెప్పారు. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రైవేటు మెడికల్‌ షాపు నిర్వాహకుడు పై కూడా ఎంక్వయిరీ చేసి , తగిన చర్యలు తీసుకోవల్సిందిగా డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు
Tags:    

Similar News