భార్యతో గొడవ.. ఫ్లై ఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్య

Update: 2023-06-06 22:00 GMT
ఈ మధ్యకాలం లో సూసైడ్ అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. చిన్న చిన్న గొడవల కు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయితేనే, అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో వంటి కారణాల తో చాలా మంది ఆత్మహత్యల కు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి... ఇంట్లో గొడవలు అయ్యాయి అని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ కు చెందిన అశోక్ అనే వ్యక్తి ఈరోజు బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి మృతి చెందిన ఘటన సీసీటీవీ లో రికార్డైంది.

ఇది చూసిన స్థానికులు భయాందోళన కు గురయ్యారు. అసలు ఏం జరిగింది అంటే ... అశోక్ అనే వ్యక్తి హైదరాబాద్‌ లో వెల్డింగ్, రిపేర్ షోలో పనిచేస్తున్నాడు. తాగుడు కు బానిసైన అశోక్... రోజూ భార్యతో గొడవ పడేవాడు. రోజూ లానే... మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. బాలా నగర్ ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. ఆపై, అకస్మాత్తుగా, అతను ఫ్లై ఓవర్ వైపు వెళ్లి... దూకాడు. దుకాడం తో కొన్ని సెకన్ల పాటు అంచుకు వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత కింద పడి చనిపోయాడు.

 ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరా లో రికార్డు అయ్యాయి ఇది చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళన కు గురయ్యారు. అనంతరం పోలీసుల కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అశోక్ మృతి పై వివరాలు సేకరించారు. అయితే అశోక్ తన జీవితాన్ని ముగించాలని ఇదివరకే అనుకున్నట్లు తెలుస్తోంది.

 అత ను ఆత్మహత్యకు పాల్పడడం ఇది మొదటిసారి కాదని దర్యాప్తులో తేలింది. అతను ఇదివరకే తన చేయిని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అది పలుసార్లు ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు మరోసారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసారి అతడు నిజంగానే ప్రాణాల ను కోల్పోయాడు. కేస్ నమోదు చేసుకున్న పోలీసులు మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఈ మృతి వెనుక మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఆత్మహత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అతని కుటుంబీకులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.



Full ViewFull ViewFull ViewFull View

Similar News