పవన్.. నీది కొబ్బరికాయల వ్యాపారమా?

Update: 2019-03-25 07:27 GMT
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి  నిన్న వార్నింగ్ ఇస్తూ ‘తొక్క తీస్తా.. తోలు తీస్తానంటూ’ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా నటుడు, వైసీపీ కార్యదర్శి ఫృథ్వీ మండిపడ్డారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.‘తొక్క తీస్తా.. తోలు తీస్తానంటున్నావే.. మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా?.. ప్రజాక్షేత్రంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావా?’ అని పవన్ కళ్యాణ్ పై నిప్పులు కురిపించారు. నోటికి ఏదోస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని పవన్ ను హెచ్చరించారు. అవినీతి చేసే టీడీపీ నేతల తోలు తీయ్యండని సూచించారు.

దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ పాలనను విమర్శిస్తాడని.. కానీ ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే అసమర్థనాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ అని ఫృథ్వీ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో టీడీపీని బంగారు సైకిల్  అని.. చంద్రబాబుని నీతిమంతుడని పొగిడి టీడీపీకి ఓట్లు వేయించావని.. మళ్లీ ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబుని సీఎం చేయాలని కష్టాలు పడుతున్నావని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మీ ఇద్దరికీ చరమగీతం ఈ ఎన్నికల్లో పాడుతారని ఫృథ్వీ చెప్పారు.

ఓటు కూడా ఏ తేదీన వేయాలో తెలియని మంగళగిరి మాలోకం లోకేష్ ని ఒక్క మాటైనా అంటున్నావా అని పవన్ ను నిలదీశారు ఫృథ్వీ. నువ్వా ప్రజాక్షేత్రంలో అవినీతిని ప్రశ్నించేది అని మండిపడ్డారు. 11న జరిగే ఎన్నికల్లో టీడీపీతోపాటు జనసేనను ప్రజలు భూస్థాపితం చేస్తారని అన్నారు. నేటి నుంచి 175 నియోజకవర్గాల్లో వీధి నాటకాల ద్వారా సినిమా కళాకారులంతా టీడీపీ అవినీతిని ప్రజలకు తెలియజేస్తామని ఫృథ్వీ అన్నారు.

ఇక మరో సినీ నటుడు జోగినాయుడు కూడా చంద్రబాబు, పవన్ లపై మండిపడ్డారు. చంద్రబాబు-పవన్ లది చీకటి ఒప్పిందమని.. జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నారు.


Tags:    

Similar News