టీడీపీ నేతల నోటి దురుసుతనంపై చంద్రబాబు మండిపడుతున్నారు. సొంత పార్టీ నేతలే ఒకరినొకరు విమర్శించుకోవడం... మిత్రపక్షం బీజేపీ నేతలపైనా నోటి ప్రతాపం చూపిస్తుండడంతో ఆయన వారిని కంట్రోల్ చేయడానికి తీవ్ర హెచ్చరికలే జారీచేశారు. పార్టీ నేతలు ఇష్టానుసారంగా నోరు జారొద్దని చంద్రబాబునాయుడు తాజాగా హెచ్చరించారు.
తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన ఇటీవల ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల వ్యవహారంపై చర్చించారు. విమర్శలు చేసుకుంటూ పలుచన కావొద్దని... ఇలాంటివి రిపీటైతే సహించే ప్రసక్తే లేదని అన్నారు. పొత్తులు, ఎన్నికల్లో కలిసివెళ్లే వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. మిత్రపక్షం బీజేపీ నేతలను కూడా ఏమీ అనొద్దని... ఎవరైనా తన ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి పనిపడతానని ఆయన అన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఉందని... అలాగే రాష్ట్రమంత్రివర్గంలో బీజేపీ నేతలు మంత్రులుగా ఉన్నారని.. ఇష్టానుసారంగా బహిరంగ వ్యాఖ్యలకు దిగితే ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు. అయితే... చంద్రబాబు చాలాకాలంగా ఇలాంటి వార్నింగులు ఇస్తున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం బేఖాతర్ అంటున్నారు.
తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన ఇటీవల ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల వ్యవహారంపై చర్చించారు. విమర్శలు చేసుకుంటూ పలుచన కావొద్దని... ఇలాంటివి రిపీటైతే సహించే ప్రసక్తే లేదని అన్నారు. పొత్తులు, ఎన్నికల్లో కలిసివెళ్లే వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. మిత్రపక్షం బీజేపీ నేతలను కూడా ఏమీ అనొద్దని... ఎవరైనా తన ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి పనిపడతానని ఆయన అన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఉందని... అలాగే రాష్ట్రమంత్రివర్గంలో బీజేపీ నేతలు మంత్రులుగా ఉన్నారని.. ఇష్టానుసారంగా బహిరంగ వ్యాఖ్యలకు దిగితే ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు. అయితే... చంద్రబాబు చాలాకాలంగా ఇలాంటి వార్నింగులు ఇస్తున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం బేఖాతర్ అంటున్నారు.