దాగుడు మూతల దర్శి

Update: 2019-03-14 07:16 GMT
నియోజక వర్గాల్లో  అసమ్మతి అనేది  చాలా కామన్‌. ఇది అన్ని పార్టీల్లో ఉండేదే. కానీ దర్శి నియోజకవర్గంలో టీడీపీకి అసమ్మతి లేదు. అలాగని ఏ సమస్య లేదంటే అంతకంటే ఎక్కువే ఉంది. దర్శి నియోజకవర్గంతో చంద్రబాబు దాగుడు మూతలు ఆడుతున్నారు. అలాగని అభ్యర్థులు కూడా ఏం తక్కువ కాదు. చంద్రబాబుకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.

దర్శి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి శిద్ధా రాఘవరావు. ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ చంద్రబాబుకి దర్శి టిక్కెట్‌ శిద్ధా రాఘవరావుకి ఇవ్వటం ఇష్టం లేదు. దీంతో.. శిద్ధాను ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సిందిగా అడిగారు. ఆయనకేమో మొహమాటం. పైకి ఓకే చెప్పినా లోపల మాత్రం దర్శి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఫిక్స్‌ అయ్యారు. ఇక శిద్ధా ఒంగోలు నుంచి పోటీ చేస్తే.. దర్శి టిక్కెట్‌ ఉగ్రనరసింహారెడ్డికి ఇవ్వాలనేది చంద్రబాబు ప్లాన్‌. ఇక ఉగ్రనరసింహారెడ్డికి దర్శి నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు. అంటే.. ఇష్టం ఉన్న వాళ్లకు అడిగింది ఇవ్వడం లేదు. ఇష్టం లేని వాళ్లకు మాత్రం అడగకుండా ఇచ్చేస్తున్నారు.దీంతో.. చంద్రబాబుపై ఫుల్‌ ఫైర్‌ లో ఉన్నారు దర్శి తెలుగు తమ్ముళ్లు. అవసరం అయితే.. నియోజకవర్గ ప్రజలంతా 200 లారీల్లో అమరావతి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు తన అభిప్రాయం  మార్చుకుని శిద్ధా రాఘవరావుకి టిక్కెట్‌ ఇవ్వకపోతే.. ఆ క్షణమై పార్టీకి రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. మొత్తానికి దాగుడు మూతల దర్శితో.. చంద్రబాబుకు చుక్కలు కన్పిస్తున్నాయి.
Tags:    

Similar News