టీడీపీ కొత్త బూచీ.. ఈసారి కేసీఆర్ పై..

Update: 2019-02-22 05:38 GMT
టీడీపీ నేతల కాళ్ల కింద నేల కదులుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదట.. ఏం చేద్దాం.. ఇప్పుడు టీడీపీ శిబిరంలో ఇదే సమాలోచనలు.. ఎవరిపైన ఈ నెపం వేద్దామని తర్జన భర్జన.. చివరకు కేసీఆర్ దొరికాడు.. ఈయనపై నెపం వేసి జగన్ ను గురిచూసి కొట్టాలని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయినట్టు విశ్వసనీయ సమాచారం.

హైదరాబాద్ లో ఆస్తులు - పెట్టుబడులు ఉండి ఏపీలో ఎంపీలు - ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు - వారి అనుయాయులంతా ఇప్పుడు వైసీపీ బాట పడుతున్నారని టీడీపీ ఓ అంచనాకు వచ్చింది. నిజానికి జాతీయ స్థాయి సర్వేలు.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈసారి ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమన్న అంచనాలు నెలకొన్నాయి. అందుకే గెలిచే పార్టీ వైసీపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. కానీ ఈ ప్రచారాన్ని కేసీఆర్-జగన్ ను అంటగట్టి లబ్ధి పొందాలని చంద్రబాబు స్కెచ్ గీసినట్టు ప్రచారం జరుగుతోంది.

అందుకే వ్యూహాత్మకంగా హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ నేతలను కేసీఆర్ బెదిరిస్తున్నారని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా చంద్రబాబు అమరావతిలో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో టీడీపీ వలసలకు కారణం నిజాయితీగా ఒప్పుకుంటే టీడీపీ ఖాళీ అవుతుందని అందుకే నెపాన్ని కేసీఆర్ భయపెడుతున్నాడని ప్రచారం చేయాలని నేతలకు సూచించినట్టు సమాచారం.

అందుకే ఇప్పుడు టీడీపీ నేతలు, మీడియా కేసీఆరే అంతా చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్థాయి బలాన్ని అంచనావేయకుండా.. ఆలోచించకుండా టీడీపీ కేసీఆర్ ను బూచీగా చూపడం విస్తుగొలుపుతోంది. ఇప్పటికైనా తరలిపోయే నేతలను బుజ్జగించి కాపాడుకుంటే పచ్చ పార్టీకి మేలు.. లేకపోతే వారి దుకాణం ఖాళీ కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
    

Tags:    

Similar News