భర్తను చంపేందుకు భారీ స్కెచ్​.. బట్టబయలు చేసిన కూతురు

Update: 2020-09-09 04:30 GMT
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే మట్టుబెట్టేందుకు స్కెచ్​ వేసింది ఓ ఇల్లాలు.. కానీ కూతురు ఎంట్రీతో సీన్​ రివర్స్​ అయ్యింది.  పరాయిమొగాళ్ల మీద మోజుతో కొందరు యువతులు.. పండంటి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.  తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన చెల్లుబోయిన కుమారికి చాలా క్రితం సుధాకర్​తో పెళ్లయింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలకు ఇప్పటికే పెళ్లిల్లు కూడా చేశారు. ప్రేమగుడ్డిది, ప్రేమకు వయస్సుతో సంబంధం లేదూ అనుకున్నదో ఏమోకానీ.. ఈ వయసులో కుమారి.. పరాయి మగవాడి మోజులో పడింది. కట్టుకున్న మొగుడ్ని వదిలిసి ఇదే ప్రాంతానికి చెందిన సతీశ్​ అనే వ్యక్తితో తిరుగుతోంది. వీరి చీకటి భాగోతాన్ని భర్త సుధాకర్​ పసిగట్టాడు. రెడ్​హ్యాండెడ్​గా ఈ జంటను దొరికించుకొని ఇద్దరినీ చితకబాదాడు. దీంతో కుమారి భర్తపై కోపం పెంచుకుంది. ఎలాగైనా మొగుడి పీడ వదిలించుకోవాలని స్కెచ్​ వేసింది. కాగా కుమారి చిన్న కూతురుకు తల్లి వ్యవహారంపై అనుమానం వచ్చింది. దీంతో ఆమె ఫోన్​లో కాల్స్​ ఆటోమెటిగ్గా రికార్డు అయ్యాలా ఫోన్​లో సెట్టింగ్​ మార్చింది.

ఆ ఆడియో క్లిప్స్​ నేరుగా తన మెయిల్​కు  వచ్చేలా సెట్​చేసుకుంది. అనంతరం తల్లి మాట్లాడిన ఆడియోక్లిప్స్​ విని కూతురు షాక్​ అయ్యింది.  భర్తను ఎలా చంపాలో తన ప్రియుడితో కలిసి తల్లి స్కెచ్​ వేసింది. అతడికి స్లో పాయిజన్​ ఇచ్చి మట్టుబెట్టాలని తన  తల్లి.. ఆమె ప్రియుడు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఓసారి అన్నంలో తక్కువ మోతాదు విషం కలిపి ఇచ్చింది. భర్త కోలుకున్నాడు. కానీ చిన్నకూతురు తన తండ్రికి సమాచారం ఇవ్వడంతో .. అతడు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో వీళ్ల వ్యవహారం బెడిసికొట్టింది.  ఈ కేసులో సతీశ్​, కుమారితోపాటు హత్యాయత్నానికి సహకరించిన సతీశ్​ స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags:    

Similar News