హార్ట్ ఎటాక్ తో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ దుర్మరణం !

Update: 2020-06-24 16:00 GMT
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఈరోజు ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటుతో మరణించారు. హైకోర్టులో విధుల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

రాజశేఖర్ మృతి పట్ల ఏపీ హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటన్నారు. రాజశేఖర్ ప్రస్తుతం ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్‌గా నియమించిన సంగతి తెలిసిందే. మహిళా అధికారి చార్జ్ తీసుకున్న మరునాడే రాజశేఖర్ చనిపోయారు. రాజశేఖర్ తమతో సఖ్యతతో ఉండేవారు, మంచి మనిషి అని.. ఆయన లేని లోటు పూడ్చలేము అని సిబ్బంది అంటున్నారు.
Tags:    

Similar News