జగన్ సర్కార్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురు ... ఏ విషయంలో అంటే
ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు లో మరోషాక్ తగిలింది. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం అన్న ఎన్ జీటీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఎన్ జీటీ తీర్పులో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిని జస్టిస్ రోయింగ్ టన్ నారీమన్, జస్టిస్ అనిరుధ్ బోస్ ల బెంచ్ విచారణ చేపట్టింది.
పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వెంకట రమణి వాదనలు వినిపించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇస్తామని , విశాఖ నగరానికి తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుందని, కొత్త ఆయకట్టు లేని ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని న్యాయవాది వెల్లడించారు.
కాగా, బాధిత రైతుల తరుఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టుకు 2006లో పర్యావరణ అనుమతులు రాగా, పురుషోత్తమపట్నం ప్రాజెక్టు పనులు 2016-17లో చేపట్టారని వివరించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేయలేదని తెలిపారు. రైతుల నుంచి తీసుకున్న భూములకు ఇంకా పరిహారం ఇవ్వలేదని కోర్టుకు నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్టీజీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పంది.
పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వెంకట రమణి వాదనలు వినిపించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇస్తామని , విశాఖ నగరానికి తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుందని, కొత్త ఆయకట్టు లేని ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని న్యాయవాది వెల్లడించారు.
కాగా, బాధిత రైతుల తరుఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టుకు 2006లో పర్యావరణ అనుమతులు రాగా, పురుషోత్తమపట్నం ప్రాజెక్టు పనులు 2016-17లో చేపట్టారని వివరించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేయలేదని తెలిపారు. రైతుల నుంచి తీసుకున్న భూములకు ఇంకా పరిహారం ఇవ్వలేదని కోర్టుకు నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్టీజీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పంది.