‘నన్ను చంపేందుకే గన్ మెన్ల తొలగింపు’.. బీటెక్ రవి సంచలనం

ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేస్తున్న వేళ.. బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేయటం ద్వారా అందరిని తన వైపు చూసేలా చేస్తున్నారు.

Update: 2023-12-29 14:56 GMT

సంచలన వ్యాఖ్యలు చేశారు పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న బీటెక్ రవి. ఈ మధ్యనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. ఈ సందర్భంగా చోటు చేసుకున్నహైడ్రామా తెలిసింది. అప్పుడు కూడా ఏదో అయిపోతుందన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత అలాంటిదేమీ లేకపోవటం.. కొన్ని చానళ్లలో హడావుడి తప్పించి ఇంకేమీ లేకపోవటం తెలిసిందే.

ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేస్తున్న వేళ.. బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేయటం ద్వారా అందరిని తన వైపు చూసేలా చేస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రే స్వయంగా ప్లాన్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేయటం ద్వారా బీటెక్ రవి అందరి అటెన్షన్ తన వైపు తిరిగేలా చేస్తున్నారు.

తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను ఈ ఉదయం (శుక్రవారం) వెనక్కి వెళ్లిపోయినట్లుగా తెలిపారు. తనకు తొలగించిన గన్ మెన్ల కేటాయింపుపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో తాను ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తే తనకు అక్కడి నుంచి పోటీ చేసేలా తెలుగుదేశం పార్టీ తనకు అవకాశం కల్పించాలన్న ఆయన.. తనకు ఏదైనా జరిగితే మాత్రం సీఎం జగన్ దే బాధ్యత అని పేర్కొనటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఆయన ప్రతి మాటలోనూ ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్లుగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News