ఎమ్మెల్యేలతో ఫేస్ టూ ఫేస్ కి ముహూర్తం ఫిక్స్ !

ఇక ఏడాది పాలన పూర్తి అయ్యాక చూసుకుంటే కనుక వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమలో నాలుగు ఉమ్మడి జిల్లాలలో చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు మీద వ్యతిరేకత ఉందని అంటున్నారు.;

Update: 2025-06-15 02:45 GMT
ఎమ్మెల్యేలతో  ఫేస్ టూ ఫేస్ కి ముహూర్తం ఫిక్స్ !

తెలుగుదేశం పార్టీ అధినేతకు అర్ధ శతాబ్దం దాకా రాజకీయ అనుభవం ఉంది. పైగా ఆయన నాలుగవ సారి సీఎం గా ఉన్నారు. ఇక ఏడాది పాటు కూటమి ప్రభుత్వం పాలన పూర్తి చేసుకుంది. దీంతో పాటు ప్రభుత్వం మీద పాలన మీద అనేక సర్వేలు నివేదికలు కూడా వస్తున్నాయి. వీటిలో చాలా వరకూ ప్రభుత్వ పనితీరు ఓకేగా ఉన్నా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల తీరు మాత్రం జనాలకు ఇబ్బందిగా ఉందని అంటున్నారు.

చాలా చోట్ల ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ప్రభుత్వ పనితీరుని ప్రభావితం చేస్తోంది అని చెబుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కొత్త వారు, వారంతా ఆ హోదాను ఇపుడు ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పాటు తాము దర్జా చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో అది కాస్తా దందాగా మారుతోంది. దీని మీదనే ఇపుడు అధినాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.

ఇక ఏడాది పాలన పూర్తి అయ్యాక చూసుకుంటే కనుక వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమలో నాలుగు ఉమ్మడి జిల్లాలలో చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు మీద వ్యతిరేకత ఉందని అంటున్నారు. వర్గ పోరు పంచాయతీలు ఇవన్నీ కూడా జనాలలో పార్టీకి ఇబ్బందులు కలిగించేవే అని అంటున్నారు.

అలాగే నెల్లూరు జిల్లాలో కూడా చాలా చోట్ల ఎమ్మెల్యే పనితీరు మీదనే జనాలు విసుగుగా ఉన్నారని అంటున్నారు. ఇసుక మద్యం బార్ ల విషయంలో చేస్తున్న దందాలే చెడ్డ పేరు తెస్తున్నాయని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా చోట్ల ఎమ్మెల్యేల అనుచరులు దూకుడు చేస్తున్నారని అలాగే రియల్ ఎస్టేట్ వంటి వాటి విషయంలో చూస్తే చేతి వాటం చూపిస్తున్నారు అని అంటున్నారు.

ఒక వైపు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నా క్షేత్ర స్థాయిలో నాయకుల తీరు వల్ల అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఇప్పటిదాకా టెలి కాంఫరెన్స్ ద్వారా పార్టీ సమావేశాల ద్వారా దిశా నిర్దేశం చేస్తూ వచ్చిన అధినాయకత్వం ఇక ఫేస్ టూ ఫేస్ తోనే వారికి గట్టిగా చెప్పాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖ వేదికగా ఉంది. ఈ యోగా డేకి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. దాంతో ఆ హడావుడిలో ప్రభుత్వం ప్రస్తుతం ఉంది. ఇది పూర్తి అయిన తరువాత అన్నీ చూసుకుని ఈ నెలాఖరు నుంచి విడతల వారీగా ఎమ్మెల్యేలతో ముఖాముఖీకి టీడీపీ అధినాయకత్వం ముహూర్తం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు. రెండవ ఏడాది నుంచి మరింత పకడ్బంధీగా ప్రజలలో ఉండేలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూసుకోవాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ గానే ఉండాలని సరైన దారిలో పెట్టాలని హైకమాండ్ అయితే డిసైడ్ అయింది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News