కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు.. దీదీకి బిగ్ షాక్!

దీంతో... లోక్ సభ ఎన్నికల వేళ ఇది మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-05-22 15:07 GMT

పశ్చిమ బెంగాల్‌ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల వేళ వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇందులో భాగంగా కోల్ కతా హైకోర్టు నుంచి వరుసగా కీలక తీర్పులు తెరపైకి వస్తున్నాయి. దీంతో... లోక్ సభ ఎన్నికల వేళ ఇది మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందులో భాగంగా... ఇటీవల టీచర్ల నియామక కుంభకోణం కేసులో 26వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు.. తాజాగా మరో సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా... ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది.

ప్రధానంగా... 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి 2012 నాటి పశ్చిమబెంగాల్‌ వెనకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

దీంతో... వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో... ఆ వర్గీకరణలు అన్నీ చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల... 2010 తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

Read more!

ఇదే క్రమంలో... 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే ఇక్కడ కాస్త ఉపశమనం ఏమిటంటే... ఈ క్లాసులతో జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపైనా ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది.

దీంతో ఈ తీర్పుపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇందులో భాగంగా ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని తాము ఏమాత్రం అంగీకరించబోమని ఆమె వెల్లడించారు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించిన తర్వాత బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించిందని అన్నారు. ఈ సందర్భంగా ఈ తీర్పును తాము ఏమాత్రం అంగీకరింబోమని.. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని మమతా స్పష్టం చేశారు.

Tags:    

Similar News