భారత్ కు బెదిరింపులు... పాక్ ఆర్మీ నోట ఉగ్రవాదుల మాట!

పాకిస్థాన్ లోని సైనికులు, ఉగ్రవాదులు వేరు వేరు కాదని.. వారిద్దరూ అవిభక్త కవలలని.. కాకపోతే ఆర్మీని ప్రపంచానికి పరిచయం చేసిన పాక్, ఉగ్రవాదులను మాత్రం రహస్యంగా పెంచుతుందని అంటారు!;

Update: 2025-05-23 08:41 GMT
భారత్ కు బెదిరింపులు... పాక్ ఆర్మీ నోట ఉగ్రవాదుల మాట!

పాకిస్థాన్ లోని సైనికులు, ఉగ్రవాదులు వేరు వేరు కాదని.. వారిద్దరూ అవిభక్త కవలలని.. కాకపోతే ఆర్మీని ప్రపంచానికి పరిచయం చేసిన పాక్, ఉగ్రవాదులను మాత్రం రహస్యంగా పెంచుతుందని అంటారు! అందుకే... పాకిస్థాన్ లోని ఆర్మీ మాట ఉగ్రవాదుల మాట ఒకేలా ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఆ విషయం మరోసారి రుజువయ్యే రెండు వీడియోలు తెరపైకి వచ్చాయి.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ఒక కారణం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ప్రసంగం కూడా అనే సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన ప్రసంగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతరం.. ఉగ్రదాడి జరిగింది! ఆ సమయంలో "ఆపరేషన్ సిందూర్"తో ఉక్కిరి బిక్కిరి చేసే ముందు పాక్ ను దౌత్యపరమైన దెబ్బలతో శిక్షించింది భారత్.

ఇందులో భాగంగా... పాక్ తో చేసుకున్న సింధూ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపేసింది. ఇది పాకిస్థాన్ ను కొట్టిన దౌత్యపరమైన ఓ గొప్పదెబ్బగా చెబుతారు. అయితే.. దీనిపై స్పందించిన పాక్ నేతలు.. పలుమార్లు భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాక్ సైనిక ప్రతినిధి భారత్ పై మూర్ఖపు ప్రేలాపనలు పేలారు!

తాజాగా ఈ విషయంపై స్పందించిన పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. “తమకు వచ్చే నీటిని భారత్ అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం.. సింధూ నదిలో జలాలకు బదులుగా వారి రక్తం పారుతుంది” అని అన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన నేపథ్యంలో స్పందించిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ మాట్లాడుతూ... “మీరు నీటిని ఆపేస్తే, దేవుడు కోరుకుంటే, మేము మీ శ్వాసను ఆపేస్తాము.. ఆపై ఈ నదులలో రక్తం ప్రవహిస్తుంది” అని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. పాక్ లో ఉగ్రవాదులకు, ఆర్మీకి తేడా లేదని అంటున్నారు.

లష్కరే తోయిబా చీఫ్ తరహాలోనే ఇలా పాక్ ఆర్మీ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆఫ్ఘాన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మరియం సోలైమాఖిల్ తీవ్రంగా ఖండించారు. దేశానికి చెందిన ఓ సైనికాధికారి ఇలా మాట్లాడటం సరైన చర్య కాదని.. పాకిస్థాన్ అధికారులు అక్కడి ఉగ్రవాదుల స్క్రిప్ట్ చదువుతున్నట్లు ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News