బ్రాహ్మిణి వాలీబాల్ ర‌ప్పాడించేసిందిగా!

ఏపీలో ఎన్నిక‌ల తేదీ స‌మీపించ‌డంతో నాయ‌కుల తో పాటు వాళ్ల ఫ్యామిలీలు కూడా జ‌నాల్లో ముమ్మ‌రంగా తిరుగుతున్నారు

Update: 2024-05-06 09:53 GMT

ఏపీలో ఎన్నిక‌ల తేదీ స‌మీపించ‌డంతో నాయ‌కుల తో పాటు వాళ్ల ఫ్యామిలీలు కూడా జ‌నాల్లో ముమ్మ‌రంగా తిరుగుతున్నారు. ప్ర‌జ‌లతో మ‌మేక‌మ‌వుతున్నారు. వాళ్ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటి కృషి దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మాటిస్తున్నారు. నారా వారి ఫ్యామిలీ నుంచి లోకేష్ స‌తీమ‌ణి...బాల‌య్య కుమార్తె బ్ర‌హ్మాణి కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇంత‌వ‌ర‌కూ బ్రాహ్మిణి ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌లేదు.

తొలిసారి తెలుగు దేశం పార్టీ త‌రుపున త‌న‌వంతు కృషి చేస్తున్నారు. త‌మ పార్టీ అధికారంలోకి రావాల‌ని ప్ర‌జ‌ల్ని కోరుతున్నారు. ప్ర‌స్తుతం బ్రాహ్మిణి , లోకేష్ పోటీ చేస్తోన్న మంగ‌ళ‌గిరి నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మార్గ మ‌ధ్యలో పిల్ల‌లు వాలిబాల్ ఆడుతుంటే వారి వ‌ద్ద‌కు బ్రాహ్మిణీ కూడా వెళ్లారు. వెళ్ల‌డ‌మే కాదు వారితో పాటు కాసేపు వాలీబాల్ ఆడారు. వాలీబాల్ లో బ్రాహ్మీణికి అనుభ‌వం ఉన్న‌ట్లుంది. అచ్చం వాలిబాల్ ప్లేయ‌ర్ లాగే ఆడారు. కోర్టు కార్న‌ర్ నుంచి స‌ర్వీసింగ్ చేసారు.

Read more!

మంచి ఆర్మ్ ప్లే చేసారు. చ‌లాకీగా కోర్టు అంతా క‌వ‌ర్ చేసారు. బ్రాహ్మిణి ఆట చూసి పిల్ల‌లు..అక్క‌డ ఉన్న వారంతా షాక్ అయ్యారు. బ్రాహ్మిణి మంచి ప్లేయ‌ర్ లా ఉందంటూ అక్క‌డి వారిలో చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. బ్రాహ్మిణిలో ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి యాంగిల్ ఎక్క‌డా బ‌య‌ట ప‌డలేదు. బాల‌య్య కుమార్తెగా..నారావారి ఇంట కోడ‌లిగానే హైలైట్ అయ్యారు. తొలిసారి ఆమె కూడా ఆట‌గ‌త్తే అన్న సంగ‌తి అంద‌రికీ అర్ద‌మైంది.

చ‌దువుకునే రోజుల్లో స్కూల్..కాలేజీ లో వాలీ బాల్ ప్లేయ‌ర్ అంటూ తెలిసిన వారు కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇక లోకేష్ లో ఛేంజ్ ఓవ‌ర్ కి కూడా బ్రాహ్మిణి అన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం స్వ‌యంగా లోకేష్ ఓ సంద‌ర్భంలోరివీల్ చేసారు. తన డైట్ ప్లాన్ అంతాబ్రాహ్మిణి ఇస్తుంద‌ని..ఆమె నుంచి చాలా విషయాలు తెలుసుకోవ‌చ్చ‌ని అన్నారు.

Tags:    

Similar News