నటుడిపై విషప్రయోగం.. ఇది రాజకీయం!

తమిళంతో పాటు తెలుగు ఇంకా పలు భాషల్లో విలన్ పాత్రలు పోషించి సుపరిచితుడు అయిన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌.

Update: 2024-04-19 04:53 GMT

తమిళంతో పాటు తెలుగు ఇంకా పలు భాషల్లో విలన్ పాత్రలు పోషించి సుపరిచితుడు అయిన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌. ఆ మధ్య హీరోయిన్‌ త్రిష పై కామెంట్స్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. చాలా మంది ఈయన తీరును విమర్శించారు. ఆ విషయం పక్కన పెడితే మన్సూర్‌ అలీ ఖాన్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు.

ఆ మధ్య రాజకీయ పార్టీని స్థాపించాడు. అయితే ఆ పార్టీ నుంచే కొన్ని కారణాల వల్ల బహిష్కరణకు గురి అయ్యాడు. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో వేలూరు నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్‌ గా పోటీ చేశాడు. గత కొన్ని రోజులుగా వేలూరు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు.

ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో అనూహ్యంగా మన్సూర్‌ అలీకి ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. తనపై విష ప్రయోగం జరిగిందని, ఎవరో తనకు జ్యూస్‌ లో విషం కలిపి ఇచ్చారు అంటూ మన్సూర్‌ అలీ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

గుడియాత్తం సంత నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎవరో ఇచ్చిన పండ్ల రసం తాగిన వెంటనే గుండె నొప్పి వచ్చిందని, తనపై విష ప్రయోగం చేసి చంపేసి రాజకీయ లబ్ది పొందాలని ఎవరో చూస్తున్నారు అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

మన్సూర్ అలీ ఖాన్ యొక్క తీరు కారణంగా, గతంలో ఆయన వ్యవహరించిన తీరు కారణంగా చాలా మంది స్పందిస్తూ ఉన్నారు. విష ప్రయోగం అనేది రాజకీయ డ్రామా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, ఎన్నికల్లో సానుభూతి కోసం మన్సూర్‌ ఇలాంటి పనులు చేస్తున్నాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆయనకే తెలియాలి.

Tags:    

Similar News