తన మరణ శాసనం తానే రాసుకుంది?

తన కోసం వెతుకుతున్న దుండగులకు తానే చిరునామా ఇచ్చింది. తన చావుకు తానే కారకురాలు అయింది

Update: 2024-05-06 02:30 GMT

తన కోసం వెతుకుతున్న దుండగులకు తానే చిరునామా ఇచ్చింది. తన చావుకు తానే కారకురాలు అయింది. తనను చంపడానికి వెతుకుతున్న వారికి ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన ఫొటో షేర్ చేయడతో అగంతకులు పసిగట్టి ఆమెను చంపారు. నాటకీయ పరిణామాల మధ్య ఆ బ్యూటీ తుది శ్వాస విడవాల్సి వచ్చింది. తనమ మరణ శాసనాన్ని తానే రాసుకున్నట్లు అయింది. సినీ ఫక్కీలో జరిగిన ఉదంతంపై ఎన్నో సందేహాలు వస్తున్నాయి.

లాండీ రాగే మిస్ ఈక్వెడార్ కంటెస్టెంట్. ఆమెకు మాదక ద్రవ్యాల డీలర్ లియోనార్డో నోరెరోతో సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఏడాది జైల్లో జరిగిన ఓ సంఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి అతడి భార్య నోరెరో హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లాండీని కూడా ఆమె హత్య చేయించినట్లు తెలుస్తోంది.

లాండీ ఈక్వెడార్ లోని ఓ రెస్టారెంట్ కు భోజనం చేయాలని వెళ్లింది. అక్కడ నుంచే సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీంతో దుండగులు ఆమె ఎక్కడున్నది పసిగట్టి రెస్టారెంట్ కు వెళ్లి ఆమెపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో తన వెంట స్నేహితుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

తాళాలు ఎక్కడున్నాయో దొంగకు తెలిసేలా చేసింది. తాను ఇలా జరుగుతుందని అనుకోక ఆమె చేసిన పోస్టుతోనే ప్రాణాలు తీసుకుంది. తన చావుకు తానే కారణంగా నిలిచింది. తన కోసం గాలిస్తున్న వారికి తానే ఆధారాలు చూపించినట్లు అయింది. నాటకీయంగా మోడల్ లాండీ పరాగా గోయ్ బురో హత్య జరగడం దారుణంగా చెబుతున్నారు.

ఓ అందగత్తె అయిన మోడల్ ను హత్య చేయడం సంచలనం కలిగించింది. తన ప్రియుడి భార్యే ఈ ఘాతుకానికి తెగబడినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇందులో విచారణ చేపడితే నిజానిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. హంతకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తొందరలోనే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు తెలుస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News