జగన్ 2.ఓ : పైసా ఖర్చు లేని పని చేయరాదా ?

రాజకీయ నాయకుల మాటలు ఎపుడూ వర్తమానంలో ఉండవు, భవిష్యత్తు గురించే ఉంటాయి. ప్రజలకు కూడా అదే చెబుతారు.;

Update: 2025-05-22 01:30 GMT
జగన్ 2.ఓ : పైసా ఖర్చు లేని పని చేయరాదా ?

రాజకీయ నాయకుల మాటలు ఎపుడూ వర్తమానంలో ఉండవు, భవిష్యత్తు గురించే ఉంటాయి. ప్రజలకు కూడా అదే చెబుతారు. మేము కనుక అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని అంటారు. తమ దగ్గర ఉన్న దాంట్లో కొద్దో గొప్పో ఇవ్వడమో లేక తమకు చేతనైన సాయం చేయడమో చేస్తేనే కదా రేపటి రోజున ఇంతకు పదింతలు చేస్తారు అని జనాలు నమ్ముతారు అన్న తర్కం ఇందులో ఉంది.

ఇక ఈ తర్కానికి అందని లెక్కలేవో రాజకీయ పార్టీల వద్ద బహుశా ఉండి ఉండొచ్చేమో. ఇక జనాలకు చెప్పినట్లే పార్టీ జనాలకు కూడా చెప్పడం అధినేతలు అలవాటు చేసుకున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. సాధారణంగా అధినాయకులకు అధికారంలో ఉన్నపుడు ఎవరూ గుర్తుకు రారు, ఏదీ గుర్తుకు రాదు అని అంటారు.

అధికారాంతమున అన్ని వెలుగులూ చీకటి అయిన వేళనే వారికి అనేక విషయాలు గుర్తుకు వస్తాయని చమత్కరిస్తూ ఉంటారు. అపుడైనా వారికి వాస్తవాలు అర్ధం అయ్యాయని సంతోషించడమే అతవల వారి పనిగా సరిపెట్టుకోవాలేమో. ఇవన్నీ ఇలా ఉంటే ఓటమి తరువాత జగన్ తరచూ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక మాట అంటున్నారు.

ఈసారి అధికారంలోకి వస్తే జగన్ 2.ఓ అని చెబుతున్నారు. మళ్ళీ పవర్ దక్కితే అన్నీ కార్యకర్తలే. వారికే అన్ని మర్యాదలు అని ఊరిస్తున్నారు. బాగానే ఉంది. జగన్ 2029లో అధికారంలోకి వస్తే అలాగే చేస్తారు అని అనుకోవచ్చు కానీ అధికారంలోకి రావాలి అన్నా ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది. అందువల్ల జగన్ ఈలోగా ఒక పార్టీ అధినేతగా తన చేతిలో ఉన్నదేదో చేయవచ్చు కదా అన్న సలహా సూచనలు వినిపిస్తున్నాయి.

పార్టీ క్యాడర్ కి ఎపుడూ అధినాయకుడి మీద వీరాభిమానం తప్పించి మరోటి ఉండదు, వారు ఏమీ ఆశించని నిస్వార్ధమైన వారు. వారికి ఒక మంచి పలకరింపు చాలు, అలాగే తమ నాయకుడి వద్దకు వెళ్తే కనిపించి వీలైతే ఒక షేక్ హ్యాండ్ లేకుంటే దూరం ముంచే చిరునవ్వుతో నిలిచి భరోసా ఇవ్వడం. ఇవే చాలు. దీనికి ఏమీ పెద్దగా అధినాయకుడు కష్టపడాల్సిందే లేదు. అంతే కాదు పెద్దగా ఖర్చు కూడా లేదు.

ఆ పని చేస్తే వారు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకే జగన్ లాంటి నేత వీలైతే తాడేపల్లి లో ఒక ప్రజా దర్బార్ లాంటిది ఏర్పాటు చేసి అందులోనే క్యాడర్ కి ప్రతీ రోజూ కొంత సమయం కేటాయిస్తే ఏపీలో మొత్తం వైసీపీ క్యాడర్ రీచార్జ్ అవుతుంది. ఒకసారి దగ్గరలో జగన్ ని చూసిన క్యాడర్ కి మరో నాలుగేళ్ళ పాటు ఏ టానిక్ అవసరం లేకుండా కిక్ వస్తుంది.

ఇక జగన్ లాంటి నాయకుడు జిల్లాల పర్యటనలకు వెళ్ళినపుడు ప్రత్యేకించి క్యాడర్ తో సమావేశాలు భేటీలు వేస్తే కచ్చితంగా వారు పార్టీకి ప్రాణం పెట్టి పనిచేస్తారు అని అంటున్నారు. అంతే తప్ప అధికారంలోకి వస్తే అందలం మీదే అని ఊరించి చెప్పే మాటలకు క్యాడర్ కి సంతోషం ఇచ్చినా వై తాత్కాలికమే అని అంటున్నారు.

మొత్తానికి చేతిలో ఉన్న అవకాశాలను వాడుకుని క్యాడర్ కి జగన్ దగ్గర కావాల్సిన సమయం ఇదే అని అంటున్నారు. ఏ పార్టీకి అయినా అధినేతకు ఎంత ప్రజాకర్షణ ఉన్నా క్యాడర్ లేకపోతే గెలుపు అన్నది పూర్తి స్థాయిలో సాధ్యపడరు. క్యాడర్ పార్టీకి జనాలకు వారధి లాంటి వారు. ఆ వారధిని మధ్యలో తెంచేయడం వల్లనే 2024లో భారీ ఓటమి దక్కింది అని అంటున్నారు. సో జగన్ 2.ఓ అన్న నినాదం చేయవచ్చు కాక దానితో పాటు ఈ విధంగా కూడా ఆలోచిస్తే మేలు అని సూచించే వారు ఉన్నారు.

Tags:    

Similar News