జగన్ హర్ట్... వారితో ఇక జన్మ వైరమే !

ఆ విషయంలో ఆయన బాగా హర్ట్ అయ్యారని అంటున్నారు. పార్టీ నేతల సమావేశంలో కూడా ఇటీవల ఇవే విషయాలను పంచుకున్నట్లుగా చెబుతున్నారు.;

Update: 2025-05-24 03:15 GMT
జగన్ హర్ట్... వారితో ఇక జన్మ వైరమే !

వైసీపీ అధినేత మీడియా మీటింగులో అన్యాపదేశంగా పేరు తెచ్చారా లేక కావాలని తెచ్చారా అన్నది పక్కన పెడితే జగన్ కి నీడగా తోడుగా ఉంటూ వైఎస్సార్ కుటుంబంతో పాటు వైసీపీతో దశాబ్దాల అనుబంధం పెంచుకున్న విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోవడం ఆయన ఈ రోజుకీ జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

ఆ విషయంలో ఆయన బాగా హర్ట్ అయ్యారని అంటున్నారు. పార్టీ నేతల సమావేశంలో కూడా ఇటీవల ఇవే విషయాలను పంచుకున్నట్లుగా చెబుతున్నారు. తాను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదని పదవులు ఇచ్చామని అందలం ఎక్కించామని కానీ అధికారం అనుభవించిన వారే పార్టీని కష్టకాలంలో వదిలేసి ఫిరాయించారని అన్నట్లుగా చెబుతున్నారు.

పార్టీలో కీలక స్థానాలు ఇచ్చి వారికి ఎంతో మర్యాద చేశానని చెప్పుకున్నారుట. తాను ఏమి తక్కువ చేశానని వారు వదిలేసి వెళ్లారని ఆయన ఆవేదన చెందారని అంటున్నారు. తాను ఎంతో చేస్తే చివరికి నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఇలా అయితే ఎవరిని నమ్మాలని జగన్ కలత చెందుతున్నారని చెబుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని పేర్లు కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారని అంటున్నారు.

విజయసాయిరెడ్డి పార్టీని వీడుతారని ఎవరూ కలలో కూడా అనుకోలేదని అంటారు. జగన్ అయితే అసలు అనుకోలేదని అంటారు. అలాగే తనతో దగ్గర చుట్టరికం ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ అదే విధంగా వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ జగన్ తో పాటు వైసీపీలో మొదటి నుంచి ఉన్న మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా పార్టీని వీడిపోవడం పట్ల జగన్ ఏమిటి ఇదేనా రాజకీయం అని అన్నారని చెబుతున్నారు.

ఇక గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య వైసీపీని వీడిపోవడం పట్ల కూడా జగన్ హర్ట్ అయ్యారని అంటున్నారు. ఆయన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్సీ ఇచామని అల్లుడైన రోశయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒకే ఇంట్లో రెండు అవకాశాలు ఇచ్చామని గుర్తు చేశారని అంటున్నారు. ఇంత చేసినా పార్టీని వీడిపోయారని అన్నారని ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే పార్టీ నాయకులు అయితే వైసీపీని వీడి పోయిన వారు అక్కడ ఏమీ సుఖపడడం లేదని వారు ఇబ్బందులు పడుతున్నారని తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని జగన్ తో అన్నారని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం వారు వచ్చినా తిరిగి చేర్చుకునేది లేదని గట్టిగానే చెప్పారని అంటున్నారు.

పార్టీకి నమ్మకద్రోహం చేసిన వారు తిరిగి చేరడానికి చూసినా చేర్చుకోమని ఖరాఖండీగా చెప్పారని అంటున్నారు. పార్టీ ఇంత చేసినా బయటకు వెళ్లిన వారు వద్దే వద్దు అని అన్నారట. వారి గురించి ప్రస్తావన తేవద్దు అని స్పష్టం చేశారట. ఇక వారి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇచ్చి వారినే గెలిపించుకుందామని జగన్ అన్నట్లుగా చెబుతున్నారు. అంతే కాదు ఏ పదవులు ఇవ్వకపోయినా పార్టీని నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారని వారికే రేపు అవకాశాలు ఇద్దామని జగన్ అన్నారని చెబుతున్నారు.

ఎంతటి పెద్ద నాయకులు అయినా ఒకసారి వైసీపీని వీడితే ఇక వారికి ప్రవేశం ఉండదని జగన్ స్పష్టం చేశారని అంటున్నారు అలాగని పార్టీ ఎవరినీ ఉండమని బలవంతం చేయదని పార్టీకి వారు చేసిన సేవలు అందుకున్న అవకాశాలు దృషిటిలో ఉంచుకుని కొనసాగితే పార్టీయే ఆదరిస్తుందని అధినాయకత్వం భావనగా ఉంది అని అంటున్నారు.

తాను మరో పాతికేళ్ళ పాటు రాజకీయం చేస్తానని జగన్ నాయకులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. జగన్ వయసు ఇపుడు 52 ఏళ్ళు. పాతికేళ్ళు అంటే 77 ఏళ్ళ దాకా రాజకీయాల్లో ఉంటాను అని అంటున్నారన్నమాట. తనను నమ్ముకున్న వారిని ఆదరిస్తాను అని అలాగని పార్టీ కాదని వెళ్ళిపోయినా అభ్యంతరం లేదని జగన్ పార్టీ నేతలతో స్పష్టం చేశారని చెబుతున్నారు నారు తనకు అధికారం ముఖ్యం కాదని కూడా చెప్పారని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ జంపింగ్ జఫాంగుల మీద ఫుల్ క్లారిటీతోనే ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News