పవన్ కళ్యాణ్ ఆఫీసు వద్ద హెలిప్యాడ్... గట్టిగా ఫిక్సయినట్లున్నారు!

దీంతో... ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన ఫిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-03-05 05:13 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక్క రోజులో రెండు మూడు నియోజకవర్గాలను కవర్ చేస్తుంటారు! దీంతో హెలీకాప్టర్ లు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఈ క్రమంలో జనసేన ఆఫీసు వద్ద తాజాగా హెలీప్యాడ్ నిర్మాణం జరిగింది! దీంతో... ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన ఫిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయనున్న జనసేనాని... పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 లోక్ సభ టిక్కెట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే... ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి ఆయన హెలీకాప్టర్ లో వచ్చారు.

ఇప్పటికే జనసేన అఫీసు సమీపంలో కొత్తగా హెలీప్యాడ్ ని నిర్మించారు. ఈ సమయంలో పవన్ హెలీకాప్టర్ లో అక్కడకి చేరుకోగానే... పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో... త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల ప్రచారం విషయంలో పవన్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయన పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారని అంటున్నారు!

కాగా... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ ప్రచారంపై టీడీపీ ఎన్నో హోప్స్ పెట్టుకుందని అంటున్నారు. క్రౌడ్ పుల్లర్ గా పేరున్న పవన్ తో ఈసారి హోరెత్తించే స్థాయిలో ప్రచారం చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే నెలన్నర రోజుల్లో పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తారని.. ఈ మేరకు పార్టీ ఆఫీసు వద్ద ప్రత్యేక హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారని అంటున్నారు!!

Tags:    

Similar News