వరుణ్ సందేశ్ 'నింద'.. ఆ నీడ ఎవరిది?

పోస్టర్ లో వరుణ్ అమయాకంగా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ ముసుగులో ఉన్న వ్యక్తి రూపం కనిపిస్తోంది. అంతే కాకుండా.. పోస్టర్‌ ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తూ ఆసక్తి రేపుతున్నాయి.

Update: 2024-05-10 13:23 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్.. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు.. సరైన రెస్పాన్స్ దక్కించుకోలేక పోయాయి. దీంతో కొంత కాలం మూవీస్ కు బ్రేక్ ఇచ్చిన వరుణ్ సందేశ్.. తన వైఫ్ వితికా శేరుతో కలిసి రియాలిటీ షో బిగ్ బాస్ లో కనిపించారు. హౌస్ లో తనదైన ఆటతీరుతో అందరినీ మెప్పించారు.

ఇక ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు వరుణ్ సందేశ్. ఆయన హీరోగా చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'చిత్రం చూడరా'.. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. హర్ష వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అల్ల‌రి ర‌విబాబు, శివాజీ రాజా కీల‌క పాత్ర‌ల్లో యాక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ మోస్తరు రెస్పాన్స్ అందుకుంటోంది.

 

అయితే వరుణ్ సందేశ్ ప్రస్తుతం 'నింద' మూవీ కూడా చేస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ రాసి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ లోగో, పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు.

వరుణ్ సందేశ్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ ను శుక్రవారం రిలీజ్ చేశారు. పోస్టర్ లో వరుణ్ అమయాకంగా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ ముసుగులో ఉన్న వ్యక్తి రూపం కనిపిస్తోంది. అంతే కాకుండా.. పోస్టర్‌ ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తూ ఆసక్తి రేపుతున్నాయి. మరి ఈ ముసుగు వ్యక్తి ఎవరు? వరుణ్ సందేశ్ కారెక్టర్ ఏంటి? అని సినిమా పై ఇంట్రెస్ట్ పెంచుతోంది ఈ పోస్టర్.

Read more!

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. మే15న ఈ మూవీ టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రూపొందుతున్న 'నింద' మూవీకి

సంతు ఓంకార్ సంగీతం అందిస్తున్నారు. అనీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News