సందీప్ వంగాపై మెహర్ రమేష్, నిర్వాణ ఎలివేషన్స్!
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి అందరికీ తెలిసిందే. హీరో రేంజ్ లోనే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.;

టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి అందరికీ తెలిసిందే. హీరో రేంజ్ లోనే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇక అర్జున్ రెడ్డి మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన ఆయన.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సంచలనం సృష్టించారు. డెబ్యూ మూవీతో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు సొంతం చేసుకున్నారు సందీప్ వంగా.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బాలీవుడ్ లో కబీర్ సింగ్ తీసిన సందీప్.. రణ్బీర్ కపూర్ హీరోగా యానిమల్ మూవీ రూపొందించారు. అలా బాలీవుడ్ లో కూడా భారీ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే యానిమల్ సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు.
కబీర్ సింగ్, యానిమల్ వర్క్స్ సమయంలో సందీప్ రెడ్డి వంగా ఎక్కువగా ముంబైలోనే గడిపారు. రీసెంట్ గా స్పిరిట్ మూవీ వర్క్స్ కూడా అక్కడే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సందీప్ కు ముంబైలో శాంతి దొరకలేదని, ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక అన్నింటికీ అటెండ్ అవుతున్నారని ఓ ఈవెంట్ లో డైరెక్టర్ శివ నిర్వాణ అన్నారు.
యువ రచయిత గణ రచించిన ప్రేమకి ప్రాణం ఉంటే.. నన్ను చెప్పుతో కొట్టుద్ది అనే తెలుగు నవల ఆవిష్కరణ రీసెంట్ గా జరిగింది. ఆ కార్యక్రమానికి సందీప్ వంగాతో పాటు మెహర్ రమేష్, శివ నిర్వాణ, సాయి రాజేష్ హాజరయ్యారు. ఆ సమయంలో శివ నిర్వాణ.. సందీప్ వంగాను ఉద్దేశించి మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
సందీప్ రెడ్డి ప్రతిభ, స్థిర వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్కు మకాం మార్చిన తర్వాత, ఆయన నగరంలో జరిగే దాదాపు ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. ఆయన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. వినయంగా ఉంటారని, ఎవరికైనా అవసరమైనప్పుడు కచ్చితంగా అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఏ తెలుగు దర్శకుడు కూడా బాలీవుడ్ లో సందీప్ లాగా ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోలేదని మెహర్ రమేష్ అభిప్రాయపడ్డారు. ఆయన మూవీలను ఆరాధిస్తామని, ఇప్పుడు స్పిరిట్ లో అదే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. అడ్వాన్స్ గానే సందీప్, ప్రభాస్ కు కంగ్రాట్స్ అండ్ బెస్ట్ విషెస్ చెప్పారు మెహర్ రమేష్.