అఖిల్‌ సినిమా నుండి వంశీ జంప్‌?

Update: 2016-05-12 06:09 GMT
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం.. ఒక పట్టాన అఖిల్‌ కు వంశీ పైడిపల్లి చేసిన కథలేవీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే.. నాగ్‌ అండ్‌ వంశీ కలసి రొమాంటిక్ సినిమా కథలను చెబుతుంటే.. అఖిల్‌మాత్రం మాస్‌ యాక్షన్‌ ఫిలింస్‌ చేయాలని అంటున్నాడట. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుండి పైడిపల్లి కామ్‌ గా సైడ్‌ అయిపోయినట్లు తెలుస్తోంది.

అవును.. ఇప్పుడు వంశీ పైడిపల్లి తన వైఫ్‌ తో కలసి వేకేషన్‌ కు అమెరికా వెళ్ళిపోయాడట. ఇప్పటికే రెండు కథలు చెప్పినా కూడా అఖిల్‌ ఒప్పుకోకపోవడం.. అలాగే మాస్‌ కథలు కావాలని అడగటంతో.. వంశీ ఈ ప్రాజెక్టు నుండి దాదాపు తప్పుకున్నాడనే అంటున్నారు. ఈ సినిమాను వదిలేసి.. మనోడు మహేష్‌ బాబు లేదా జూ.ఎన్టీఆర్‌ లతో సినిమా చేసుకుంటాడట. కాని అఖిల్‌ మాత్రం.. ఇంకా మాస్‌ కథల కోసం వెతుకుతూ.. వంశీని మళ్ళీ టచ్‌ చేద్దాం అని అనుకోకపోవడం కూడా కాస్త వండరే.

కాని మాస్‌ సినిమాలే కావాలని కూర్చున్న అఖిల్‌మాత్రం.. ఇతర డైరక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ప్రస్తుతం అఖిల్‌ మైండ్‌ సెట్‌ ను మార్చేపనిలో నాగ్ కూడా బిజీగా ఉన్నారని చెబుతున్నారు.
Tags:    

Similar News