V మెగా పాన్ ఇండియా.. అప్డేట్ అదిరింది

Update: 2023-05-28 12:56 GMT
కార్తికేయ 2 మూవీ తో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ నిఖిల్ సిద్ధార్ద్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే బ్యానర్ లో మరో పాన్ ఇండియా స్టఫ్ తో నిఖిల్ సిద్ధార్ద్ రెడీ అవుతూ ఉండటం విశేషం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యూవీ క్రియేషన్స్ విక్రమ్ సంయుక్తంగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో మొదటి చిత్రంగా అభిషేస్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి ది ఇండియన్ హౌస్ అనే మూవీ ని ప్రారంభించారు. నిఖిల్ సిద్ధార్ద్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబందించిన మోషన్ టైటిల్, ఫస్ట్ లుక్ ప్రోమోని లాంచ్ చేశారు.

రామ్ వంశీ కృష్ణా ఈ మూవీ తో దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. అలాగే నిఖిల్ తో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారత చరిత్రలో మరిచిపోయిన అధ్యాయం. 1905లో లండన్ రివల్యూషన్ లో ఒక ప్రేమ కథని ఈ మూవీ లో చూపించబోతున్నారు. నిఖిల్ సిద్ధార్ద్ శివ అనే పాత్రలో నటిస్తున్నాడు.

అతను సముద్రం దాటుకొని లండన్ వెళ్తాడు. అక్కడ మంటల్లో ది ఇండియన్ హౌస్ దగ్ధం అవుతున్న దృశ్యాలు విజువల్ లో చూపించారు. అక్కడ ఒక షూట్ కేస్ పట్టుకొని నిఖిల్ లుక్ ని రివీల్ చేశారు. ఓవరాల్ మోషన్ విజువల్ చూస్తూ ఉంటే రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తి తో తెరకెక్కిన ఒక హీరో కథగా ఈ మూవీ ఉండబోతోంది అని తెలుస్తోంది.

 కార్తికేయ2, స్పై 2 చిత్రాల తర్వాత నిఖిల్ కెరియర్ లో చేస్తోన్న మరో డిఫరెంట్ సబ్జెక్ట్ మూవీగా ది ఇండియా హౌస్ ఉండబోతోందని అర్ధమవుతోంది. ఇక ది ఇండియా హౌస్ టైటిల్ క్రింద జై మాతా జి అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనిని బట్టి ఈ కాన్సెప్ట్ లో రిలీజియన్ ఎలిమెంట్స్ ని టచ్ చేయబోతున్నారని అర్ధమవుతోంది. మరి వి మెగా పిక్చర్స్ బ్యానర్ నుంచి రాబోతున్న పీరియాడికల్, రియల్ స్టొరీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.Full View




Similar News