టాలీవుడ్ కు మరో విషాదం.. సీనియర్ దర్శకుడికి రోడ్డు ప్రమాదం

Update: 2020-01-22 04:30 GMT
టాలీవుడ్ లో మరణ మృందంగం కొనసాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా దిగ్గజ కమెడియన్స్ అంతా తనువు చాలించారు. ఇటీవలే దేశం గర్వించే గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన దర్శకురాలు విజయనిర్మల కూడా మరణించారు. టాలీవుడ్ కు శాపం తగిలినట్టుగా ఒక్కరొక్కరు చనిపోతుండడం విషాదం నింపుతోంది.

ఇక సినీ ప్రముఖుల రోడ్డు ప్రమాదాలు కూడా తరుచూ జరుగుతుండడం కలవరపెడుతోంది. ఈ మధ్యనే సీనియర్ హీరో రాజశేఖర్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

ఇలాంటి తరుణం లో టాలీవుడ్ ను మరో విషాద వార్త కుదిపేసింది. టాలీవుడ్ దర్శకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం కలవరపెడుతోంది.

సప్తగిరి ఎల్ ఎల్బీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మల్లికార్జున్ రావు(చరణ్ లక్కాకుల) తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

మల్లికార్జున్ రావు పరిస్థితి సీరియస్ గా ఉంది. వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈయన రోడ్డు ప్రమాదానికి గురికావడంతో సిని పెద్దలు, కొందరు దర్శకులు వచ్చి పరామర్శించారు.
Tags:    

Similar News