ఆంధ్ర అంతా చక్కబెట్టేస్తున్నారు

Update: 2018-03-16 23:30 GMT
ఒకప్పుడు సినిమా ఫంక్షన్స్ అంటే హైద్రాబాద్ లోనే ఉండేవి. అడపా దడపా ఒకటిఅరా ఈవెంట్స్ మాత్రం ఇతర ప్రాంతాల్లో జరిగేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ప్రతీ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాల్లో వేడుకలు జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

రాంచరణ్ మూవీ రంగస్థలంకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్న సంగతి తెలిసిందే. మార్చ్ 18న ఈ వేడుక జరగనుంది. పెద్ద సినిమాలకు మాత్రమే కాదు.. మీడియం బడ్జెట్ సినిమాలు.. లో బడ్జెట్ మూవీ మేకర్స్ కూడా ఏపీపై కన్నేశారు. నాని నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం కోసం.. ఈ నెలాఖరున తిరుపతిలో ఈవెంట్ నిర్వహించనున్నారు. నిఖిల్ మూవీ కిర్రాక్ పార్టీ కోసం.. విజయవాడలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిపారు. రాజమండ్రి.. గుంటూరు.. భీమవరం లాంటి ఏరియాల్లో కూడా వేడుకలు జరుగుతున్నాయి. తొలిప్రేమ ఈవెంట్ ను భీమవరంలోను.. ఛలో కోసం విశాఖపట్నంలోను ఈవెంట్స్ నిర్వహించారు.

విజయవాడ.. విశాఖ మినహాయిస్తే.. మిగిలిన ఏరియాల జనాలకు ఇలాంటి వేడుకలు కొత్త. అందుకే ఆడియో ఫంక్షన్.. ప్రీ రిలీజ్ ఈవెంట్.. సక్సెస్ మీట్.. ఇలా పేరు ఏదైనా సరే తమ అభిమాన తారలను అతి దగ్గరగా చూసే అవకాశం వస్తుండడంతో.. చిన్నా పెద్దా అనే తేడాలు  లేకుండా భారీ సంఖ్యలో ఆడియన్స్ అటెండ్ అవుతున్నారు. పబ్లిసిటీ యాంగిల్ లో కూడా ఇది మేకర్స్ కు ప్లస్ అవుతోంది. మరోవైపు తెలంగాణలో కూడా వరంగల్ లాంటి టౌన్స్ లో వేడుకలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News