8 ఏళ్ల తర్వాత భరణి పెళ్లిసందD

Update: 2020-11-25 15:45 GMT
బహుమఖ పజ్ఞాశాలి అనేందుకు చక్కని ఉదాహరణగా తనికెళ్ల భరణి నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రచయితగా నటుడిగా దర్శకుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. నటనలో ఆయన పండి పోయాడు. ఆయన పోషించని పాత్ర అంటూ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి తనికెళ్ల భరణి ఎనిమిది సంవత్సరాల క్రితం 'మిథునం' సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా ఒక సంచలనం. అలాంటి ఒక సినిమాను తీసిన దర్శకుడు తనికెళ్ల భరణి దర్శకత్వంలో వరుసగా సినిమాలను ప్రేక్షకులు ఆశించారు. కాని ఆయన మాత్రం ఏవో కారణాల వల్ల దర్శకత్వంకు దూరంగా ఉన్నాడు. భక్త కన్నప్పను తెరకెక్కించాలని కోరుకున్నా కూడా సాధ్యం కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు భరణి మెగా ఫోన్‌ పట్టబోతున్నాడు.

మీడియా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రాఘవేంద్ర రావు నిర్మాణ సారథ్యంలో రూపొందబోతున్న పెళ్లిసందD సినిమాకు భరణి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. దర్శకేంద్రుడు అన్ని వ్యవహారాలు చూసుకుంటాడు. ఆయన సారథ్యంలో దర్శకత్వం వహించాల్సి ఉంటుంది. భరణి కి పెళ్లి సందడి సినిమాతో అనుబంధం ఉంది. ఆ కారణం వల్లే పెళ్లిసందD సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేశారట. అందుకే రాఘవేంద్ర రావు ఆయనకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News