ట్రైలర్ టాక్: శ్రీవల్లిలో ఎన్ని జోనర్లో!!

Update: 2017-01-24 05:18 GMT
బాహుబలి రైటర్.. రాజమౌళి ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు దర్శకుడిగా కూడా మారి.. ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవల్లీ అంటూ తెరకెక్కిన ఈ చిత్రానికి.. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒకటి రెండు జోనర్లను మిక్స్ చేసి సినిమాలు తీయడం కామన్ అయిపోయింది. కానీ శ్రీవల్లి ట్రైలర్ ను చూస్తే ఆశ్చర్యం వేయకమానదు.

ఓ క్లాస్ రూమ్ లో ప్రొఫెసర్ స్పీచ్ తో ట్రైలర్ మొదలవుతుంది. మనిషి మనసులోకి తొంగిచూడగలిగితే.. అన్నది శ్రీవల్లీ మూవీకి మెయిన్ థీమ్. ఇందుకోసం నగ్నంగా కూర్చునేందుకు రెడీ అంటుంది హీరోయిన్. సైన్స్ ద్వారా ఆమె మనసును చదివేసి.. గతాన్ని తెలుసుకోవడం అన్నమాట. అక్కడి నుంచి పునర్జన్మల కాన్సెప్ట్ వైపు ఈ ట్రైలర్ మళ్లుతుంది. పీరియాడిక్ ఫిలిం అనిపించే టైపులో సాగుతున్నంతలో.. థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేసిన విషయం స్పష్టంగానే కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు హీరోయిన్ నేహా హింగే పండించిన అందాలు.. మొహంపై పలికించిన భావాలు చూస్తుంటే.. ఈరోటిక్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలగక మానదు.

సైన్స్ ఫిక్షన్ కథాంశానికి పీరియాడికల్ స్టోరీ జతచేసి.. ఈరోటిక్ థ్రిల్లర్ గా మలిచాడు దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. రజత్-నేహా హింగేలు నటించిన శ్రీవల్లి మూవీ ట్రైలర్ ఆడియన్స్ లో ఆసక్తి కలిగిస్తుందని సందేహం అక్కర్లేదు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News