#చిరు151 పబ్లిసిటీ మొదలైపోయింది

Update: 2017-02-27 08:24 GMT
అదేంటి.. ఇంతవరకు ప్రాజెక్టే ఎనౌన్స్ అవ్వలేదు అప్పుడే పబ్లిసిటీ ఏంటి అనుకుంటున్నారా? అయితే నిజంగానే పబ్లిసిటీ మొదలెట్టేశారు గురూ. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా తొలి ఫ్రీడమ్ ఫైటర్ ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' కథను చేయనున్నాడని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో హీరో శ్రీకాంత్ ప్రకటించడమే ఈ విశేషం.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను గురించి.. ఆయన ఫ్యామిలీపై నిన్న సాయంత్రం అలాగే ఈరోజు ఉదయం టివి9లో ఒక ప్రత్యేక కథనం వేశారు. నటుడు శ్రీకాంత్ స్వయంగా ఉయ్యాలవాడ గ్రామానికి వెళ్లి.. అక్కడ ఉయ్యాలవాడ వారి కుటుంబాన్ని కలసి.. ఆ కథను అందరికీ తెలిపే ప్రయత్నం చేశారు. ఇక అఫీషియల్ గానే ఈ కథతో చిరంజీవి గారు సినిమా చేస్తున్నారని చెప్పడంతో.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందపడ్డారు. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించి.. అనేక కొత్త విషయాలను తెలుసుకుంటారని ప్రోగ్రామ్ ఎండింగ్ లో చెప్పేశారు కూడా. అంటే సురేందర్ రెడ్డి డైరక్షన్లో చేస్తున్న ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' సినిమాకు అప్పుడే ప్రచారం మొదలెట్టేసినట్లేగా.

చూస్తుంటే  ఖైదీ నెం 150 మెగా సక్సెస్ తరువాత చిరంజీవి యునిక్ ప్రమోషన్ స్ర్టాటజీలను పాటిస్తున్నట్లు అనిపించట్లేదూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News