మిల్కీ బ్యూటి.. ముగ్గురు పంచుకున్నారు..

Update: 2016-07-30 22:30 GMT
ప్రస్తుతం లీడ్ పాత్రలో తన సత్తా ఏంటో చాటడానికి సిద్దపడుతోంది మిల్కీ బ్యూటి తమన్నా. ''అభినేత్రి'' అంటూ ఒక హారర్‌ కామెడీతో మన ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం ఆమె చిందించిన గ్లామర్ తాలూకు సెగలు ఆల్రెడీ టాలీవుడ్డుకు తగిలేశాయ్. ఇకపోతే ఈ సినిమా నిర్మాతల గురించి ఒక ఆసక్తికరమైన విషయం మనం తెలుసుకోవాలి.

తెలుగులో వేరే స్లీపింగ్ పార్టనర్ తో కలసి కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు మనం అభినేత్రి పోస్టర్లలో చూడొచ్చు. తమిళంలో అయితే.. ఈ సినిమా నిర్మాత ప్రభుదేవా అని ఉంటుంది. అక్కడ ''డెవిల్'' అనే పేరుతో విడుదలవుతోంది. అదే హిందీలో అయితే.. ''2 ఇన్ 1'' పేరుతో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ సోనూ సూద్ నిర్మాత అని తెలుస్తోంది. అంటే సినిమాలో నటిస్తున్నందుకు.. తమిళ వర్షన్ హక్కులను ప్రభుదేవా.. హిందీ వర్షన్ ను సోనూ సూద్ తీసుకున్నారనమాట. ఇక తెలుగు వర్షన్ కు మాటలు అందించినందుకు కోన వెంకట్ ఆ వాటాను ఇలా మార్చుంటాడు.

అయితే ఈ ముగ్గురు ప్రొడ్యూసర్లను కాపాడాల్సింది మాత్రం దర్శకుడు ఏ.ఎల్.విజయ్ మరియు హీరోయిన్ తమన్నా మాత్రమే. ఎందుకంటే సినిమా ధియేటర్లకు జనాలు బారులు తీరేది మిల్కీ బ్యూటి గ్లామర్ చూశాకనే. ఇక ధియేటర్లలో నుండి పాజిటివ్ టాక్ బయటకు రావాలంటే.. అది కేవలం విజయ్ చేతుల్లోనే ఉంది. సెప్టంబర్ 9న ఈ సినిమా విడుదలవుతోంది. చూద్దాం ఏమవుతుందో.
Tags:    

Similar News