సెట్స్‌ లో బొమ్మలేస్తోంది ఈ అమ్మడు

Update: 2015-07-31 11:41 GMT
చిత్ర లేఖనం అనేది గొప్ప కళ. రాజా రవివర్మ, పికాసో వంటి పేర్లు చరిత్రలో నిలిచిపోయాయంటే అది చిత్రలేఖనం వల్లే సాధ్యమైంది. అయితే ఈ కళ ఎందరో సెలబ్రిటీల్లోనూ అప్పుడప్పుడు బయటపడుతుంటుంది.

బాలీవుడ్‌ హీరోల్లో కండల హీరో సల్మాన్‌ ఖాన్‌ ని గొప్ప పెయింటర్‌ గా చెబుతుంటారు. అతడు తీరిక సమయాల్లో కుంచె పట్టి అద్భుత కళాఖండాల్ని లిఖిస్తుంటాడు. వాటిని గ్యాలరీల్లో పెట్టి విక్రయించి అలా వచ్చిన డబ్బును అనాధ బాలలకు పంచిన సందర్భాలున్నాయి. అయితే సల్లూ భాయ్‌ నుంచి ఇన్‌స్పయిర్‌ అయ్యిందో ఏమో సోనాక్షి సిన్హా కూడా ఇటీవలి కాలంలో చిత్రలేఖనంపై మక్కువ చూపిస్తోంది.

అంతేనా ఆన్‌ సెట్స్‌ క్షణం తీరిక చిక్కినా అక్కడ కాన్వాసు పై బొమ్మలు గీసే పనిలో పడుతోంది. ప్రస్తుతం ఈ భామ ఇండియన్‌ ఐడల్‌ చిల్డ్రన్‌ మ్యూజిక్‌ రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షో చిత్రీకరణలో ఉండగా ఆన్‌ సెట్స్‌ సోనాక్షి ఓ అందమైన అమ్మాయి బొమ్మను గీస్తూ అందరికళ్లలో పడింది. ప్రస్తుతం ఈ విషయంపైనే బాలీవుడ్‌ లో ముచ్చటించుకుంటున్నారు.
Tags:    

Similar News