గోవా పార్టీలో నిర్మాత‌తో ట్యాలెంటెడ్ హీరోల చిలౌట్

Update: 2020-12-19 09:33 GMT
ఇటీవ‌ల మాల్దీవుల విహారంలో ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు ఫుల్ చిలౌట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మాల్దీవుల త‌ర్వాత టాలీవుడ్ సెల‌బ్రిటీలు అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చే లొకేష‌న్ గోవా బీచ్.

తాజాగా ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత దిల్ రాజు వ‌రుస పార్టీల గురించి తెలిసిందే. ఆయ‌న 50వ బ‌ర్త డే సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని స్టార్ హోట‌ల్లో ప‌రిశ్ర‌మ అగ్ర‌జుల కోసం ప్ర‌త్యేక పార్టీని ఏర్పాటు చేయ‌గా ఆ ఫోటోలు అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో విహ‌రిస్తున్నాయి. ఈ పార్టీకి ప‌వ‌న్ .. ప్ర‌భాస్.. మ‌హేష్ లాంటి స్టార్లు విచ్చేశారు.

తాజాగా దిల్ రాజు గోవా పార్టీ కి సంబంధించిన ఫోటోలు రివీల‌య్యాయి. ఇక గోవా బీచ్ పార్టీలో హీరో సిద్ధార్థ్.. శ‌ర్వానంద్ లాంటి యువ‌హీరోలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. సిద్దార్థ్ ... శర్వానంద్ ల స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీలో దిల్ రాజు ఒక భాగం. అందుకే ఆ ఇద్ద‌రూ స్పెష‌ల్ ఆత్మీయ‌ గెస్టులుగా హాజ‌ర‌య్యారు. సిద్ధార్థ్ నటించిన `బొమ్మరిల్లు`.. శర్వానంద్ కెరీర్ బిగ్గెస్ట్  హిట్  `శతమానం భవతి` రెండిటికీ ఆయ‌నే నిర్మాత‌. ఇక హైద‌రాబాద్ ఈవెంట్లో ఆ ఇద్ద‌రూ మిస్స‌యిన సంగ‌తి తెలిసిన‌దే. ప్ర‌స్తుతం అజయ్ భూపతి తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా `మహా సముద్రం`లో సిద్ధార్థ్ - శర్వానంద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Tags:    

Similar News