పవన్ కోసం శృతి తిరిగొచ్చేసింది

Update: 2017-02-21 07:55 GMT
తెలుగు.. తమిళం.. హిందీ ప్రాజెక్టులతో శృతి హాసన్ ఇప్పుడు బాగా బిజ్జీ అనే విషయం తెలిసిందే. ప్రాజెక్టుల ఎంపికలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న శృతి హాసన్.. కొన్ని వారాలుగా కశ్మీర్ లో మకాం వేసింది. ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం అక్కడకు వెళ్లిన ఈ చెన్నై భామ.. ఇప్పుడు హైద్రాబాద్ తిరిగొచ్చేశానని చెబుతోంది.

శృతి ప్రస్తుతం కాటమరాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలాఖర్లో విడుదలకు ప్లాన్ చేయగా.. ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ ని పిక్చరైజ్ చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ కోసం కొన్ని పాటల షూటింగ్ జరపాల్సి ఉంది. వీటి కోసం హైద్రాబాద్ లో వాలిపోయిన శృతి.. 'హలో హైద్రాబాద్.. కాటమరాయుడు షూటింగ్ కోసం వచ్చేశాను. ఇవాల్టి నుంచి జరగనున్న సూపర్ డూపర్ వర్క్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అంటూ ట్వీట్ పెట్టింది శృతి.

ఫ్యాక్షనిస్ట్ గా పవర్ స్టార్ కనిపించనున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఏర్పడిపోయాయి. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ గా బిజినెస్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. కాటమరాయుడు చిత్రం ద్వారా రేణూ దేశాయ్ కాకుండా పవన్ తో రెండోసారి జత కట్టిన భామగా శృతి హాసన్ రికార్డ్ సృష్టించేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News