హిట్టు కథకు హిందీ డేట్ ఫిక్సయ్యింది

Update: 2018-05-24 06:27 GMT
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో.. అనే ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పడానికి పెద్ద సమయం పట్టదు. ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ చెప్పిన ఆ డైలాగ్ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా అర్దాన్ని దర్శకుడు దేవకట్ట ఆ ఒక్క డైలాగ్ తో చెప్పేశాడు. ఇక సినీ ప్రముఖులను ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. కమర్షియల్ గా పెద్దగా హిట్ అవ్వకపోయినా అవార్డులు మాత్రం బాగానే దక్కాయి.

ఇక ఇతర ఇండస్ట్రీలో కూడా ప్రస్థానం కథ హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ లో అయితే రీమేక్ చేయాలని గత కొంత కాలంగా చాలా మంది ప్రయత్నించారు. కానీ ఫైనల్ గా ఆ కథ సంజయ్ దత్ కి రాసిపెట్టినట్లు ఉంది. అందుకే ఆయన సరికొత్తగా సాయి కుమార్ చేసిన పాత్రను చేయబోతున్నారు. ఆ రీమేక్ కథకు ఒరిజినల్ దర్శకుడు దేవకట్టనే దర్శకత్వం వహించనున్నాడు. సినిమా కథ నచ్చి సంజయ్ తన ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా తన సొంత బ్యానర్ సంజయ్ దత్ ప్రొడక్షన్ లోనే నిర్మించడానికి డిసైడ్ అయ్యాడు.

జూన్ 1 నుంచి సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ సంజయ్ ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఆ రోజు సంజయ్ తల్లి నర్గీస్ దత్ పుట్టిన రోజు కావడంతో దర్శకుడిని రెడీగా ఉండమని చెప్పాడట. అలీ ఫజల్ - అమైరా దస్తూర్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక దర్శకుడు దేవకట్ట కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరి బాలీవుడ్ లో అయినా ఈ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
Tags:    

Similar News