హేయ్.. సంపూ ఫోటో దిగేశాడోచ్

Update: 2018-01-23 09:58 GMT
అజ్ఞాతవాసి సినిమా ఎంత దారుణంగా డిజాస్టర్ అయ్యింది అని అభిమానులు బాధపడుతున్న వేళ పవన్ ప్రజా యాత్రను స్టార్ట్ చేసి ఒక్కసారిగా అంతా మరచిపోయేలా చేశాడు. అభిమానులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నడవడానికి సిద్ధమయ్యారు. సోమవారం తెలంగాణ రాష్ట్రంలో ఆయన స్టార్ట్ చేసిన యాత్ర విజయవంతంగా సాగింది. అయితే పవన్ కళ్యాణ్ కు కొంత మంది సినీ ప్రముఖులు కూడా మద్దతు పలుకుతున్నారు.

ముఖ్యంగా మెగా హీరోలు రామ్ చరణ్ - సాయి ధరమ్ తేజ్ అలాగే వరుణ్ తేజ్ కూడా జై జనసేన అని సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇవ్వగా.. ఇప్పుడు కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు కూడా మద్దతు ఇచ్చారు. పవన్ యాత్రను స్టార్ట్ చేశాడని మొదటి సారి ప్రత్యేకంగా కలవడానికి వెళ్లగా పవన్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇక సంపూ పవర్ స్టార్ తో దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని తెలియజేశాడు.

ఫైనల్ గా లిడర్ ని కలిశాను..మీ మాటలు స్ఫూర్తిదాయకం. మీ బాటలోనే మేము.. జై హింద్ అంటూ సంపూర్ణేష్ బాబు చేసిన ట్వీట్ మెగా అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. మొత్తానికి పవన్ తెలంగాణాలో తన అభిమానులను ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ ఇక ముందు ఏం చేయాలనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. పవన్ జై తెలంగాణ అని నినాదాలు కూడా చేస్తున్నాడు.
Tags:    

Similar News