మెగా కాంబో కి లక్కీ గర్ల్

Update: 2017-08-16 05:28 GMT
మలయాళం లో ప్రేమమ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హీరోయిన్ గా పెరు తెచ్చుకున్న భామ అనుపమ పరమేశ్వరన్. ఇప్పటివరకు ఈ భామ నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాల్ని అందుకున్నాయి. ముఖ్యంగా "అఆ" సినిమాలో చేసింది సైడ్ హీరోయిన్ గా అయినా తన పాత్రకు న్యాయం చేసి అందరిని ఆకట్టుకుంది. ఇక తెలుగు ప్రేమమ్ లో అలాగే శతమనం భవతి సినిమాతో హీరోలకు అదృష్ట లక్ష్మీ గా మారిపోయింది.

అయితే ఇప్పుడు ఈ అదృష్ట లక్ష్మీ మెగా హీరోకి జోడికట్టే ఛాన్స్ కొట్టేసింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీలో సాయి తో కలిసి రొమాన్స్ చేయడానికి సిద్ధమైపోయింది. ఈ క్రేజీ కాంబినేషన్ ను ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. లవ్ స్టోరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కరుణాకరన్ సాయి ని లవర్ బాయ్ గా చూపించబోతున్నాడట. చాలా రోజుల నుండి కరుణాకరన్ కి సరైన హిట్ లేదు. ఇక  సాయి ధరమ్ తేజ్ కూడా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి ఈ ఇద్దరికి అనుపమ ద్వారా ఏ స్థాయిలో హిట్ అందుకుంటారో చూడాలి.

ఇక అనుపమ కూడా ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ లో ఉంది.   రామ్ హీరోగా "ఉన్నది ఒకటే జిందగి" మరియు నాని-మెర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాల్లో బిజీగా ఉంది. అలాగే నాగ చైతన్య తో ఓ సినిమా మరియు ఇతర తమిళ్ -మలయాళం ప్రాజెక్ట్ లో కూడా అనుపమ నటిస్తోందని తెలుస్తోంది.
Tags:    

Similar News