మేనల్లుడు లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు

Update: 2017-12-12 14:25 GMT
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చివరగా జవాన్ తో వచ్చి కొంచెం నిరాశ పరచాడనే చెప్పాలి. అసలే గత కొంత కాలం నుంచి ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. జవాన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ సాయి ధరమ్ తేజ్ ఎన్ని అపజయాలు అందుకుంటున్నా కూడా తన నటనలో  ఏ మాత్రం ఎనర్జీని తగ్గించడం లేదు. నటనలో మనోడు బాగానే రాటు దేలాడని చెప్పవచ్చు.

దీంతో బడా దర్శకులు రాసుకున్న కథకి సాయి సెలెక్ట్ అవుతున్నాడు. ఇప్పటికే వివి.వినాయక్ తో ఒక సినిమాను చేయడానికి రెడీ అయిన సాయి అప్పుడే కరుణాకరన్ తో సినిమాను స్టార్ట్ చేసేశాడు. ప్రేమకథలను ఎంతో అందంగా చూపించే కరుణాకరన్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతను కూడా కొంచెం డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. చివరగా నితిన్ తో చిన్నదాన నీకోసం సినిమాతో అపజయాన్ని అందుకున్న కరుణాకరన్ ఈ సారి సాయితో మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన స్వీట్ లవ్ స్టోరీని తెరకెక్కించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేని ఈ న్యూ మూవీ షూటింగ్  ఈ రోజు శంషాబాద్ లోని ఓ ప్రయివేట్ కాలేజ్ లో స్టార్ట్ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను సీనియర్ నిర్మాత కేఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇక డార్లింగ్ సినిమాకు మాటలను అందించిన డార్లింగ్ స్వామి ఈ కథకు కూడా మాటలను రాశాడు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాత సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.    
Tags:    

Similar News