సాహో టీమ్ మెంబర్స్ ఆస్ట్రియాలో సందడి..

Update: 2019-06-25 10:13 GMT
ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ అంతా పూర్తయింది కానీ పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.  పాటలను అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించేందుకు యూరోప్ షెడ్యూల్ ప్లాన్ చేసింది 'సాహో' టీమ్.  ప్రస్తుతం సాహో గ్యాంగ్ అంతా ఆస్ట్రియా దేశంలో ఉన్నారని సమాచారం.

ఆస్ట్రియాలో ఎత్తైన కొండలు.. అందమైన ప్రదేశాలు ఉన్నాయట.  మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రభాస్.. శ్రద్ధా కపూర్ తో పాటు మరికొందరిని 1368 మీటర్ల ఎత్తులో ఉండే ఒక ప్రదేశానికి కేబుల్ కార్లలో తీసుకెళ్లాలని అనుకున్నారట. కానీ అక్కడ మంచు ప్రభావం ఎక్కువగా ఉందట.. దీంతో ప్రభాస్ వద్దని చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారట.   అక్కడికి పోకుండానే ఇతర లోకేషన్లలో మంచు ప్రదేశాలలో రొమాంటిక్ సాంగ్స్ ను చిత్రీకరించారని సమాచారం.  ఇదిలా ఉంటే షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్.. శ్రద్దా కపూర్ తదితరులు ఆస్ట్రియాలో ఫుల్ గా తిరుగుతూ.. షాపింగ్ చేస్తూ చిల్ అవుట్ అయ్యారట.  ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ ను యూవీ క్రియేషన్స్ వారు దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్.. జాకీ ష్రాఫ్..అరుణ్ విజయ్.. వెన్నెల కిషోర్.. ఎవెలిన్ శర్మ.. మందిరా బేడీ.. మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఆగష్టు 15 న రిలీజ్ కానుంది.


Tags:    

Similar News