ఆ హీరో, హీరోయిన్‌ రిలేష‌న్ తెలిసి.. ద‌ర్శ‌కుడి దిమ్మ తిరిగింది!

Update: 2021-06-29 11:30 GMT
ఈ మధ్య హీరో సందీప్ కిష‌న్ సినిమా 'ఏ1 ఎక్స్ ప్రెస్‌' రిలీజ్ అయ్యింది. విడుద‌ల‌కు ముందు నిర్వ‌హించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రసంగం మ‌ధ్య‌లో సందీప్ కిష‌న్ ను 'అన్న‌య్యా' అని పిలిచేసింది. స్టేజ్ మీద ఉన్న‌వారితోపాటు ఆడియ‌న్స్ కూడా నోరెళ్ల‌బెట్టారు.

హీరో హీరోయిన్ మ‌ధ్య రిలేష‌న్ ల‌వ‌ర్స్ గానో.. వైఫ్ అండ్ హ‌జ్బెండ్ గానో ఊహించుకుంటారు ఫ్యాన్స్‌. సినిమాలోనూ అదేవిధంగా ఉంటుంది. అలాంటిది.. బ‌య‌ట అన్న‌య్యా అని పిలిస్తే.. ఆ ఫీల్ పోతుంద‌ని భ‌య‌ప‌డ‌తారు మేక‌ర్స్‌. నిజానికి కూడా కొంత ఎఫెక్ట్ చూపే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే.. న‌టీన‌టులు ఎవ్వ‌రూ అలాంటి రిలేష‌న్ ను బ‌య‌ట‌కు చెప్ప‌రు.

అయితే.. హీరోయిన్ స‌దా కూడా ఇదేవిధమైన రిలేష‌న్ మెయింటెయిన్ చేశార‌ట‌. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన 'అప‌రిచితుడు' సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ భారీ బ్లాక్ బస్టర్ సినిమాలో విక్రమ్ హీరో అన్న సంగతి కూడా తెలుసు. అయితే.. ఆన్ స్క్రీన్ వీరిద్ద‌రి 'రెమో' మ్యాజిక్ ఎంత ఆక‌ట్టుకుందో అంద‌రూ చూశారు.

కానీ.. ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం.. హీరో విక్ర‌మ్ స‌దాను చెల్లి అని పిలిచేవాడ‌ట‌! ఓ సారి అలా పిల‌వ‌గా.. ద‌ర్శ‌కుడు శంక‌ర్ చూశార‌ట‌. ద‌గ్గ‌రి ప‌రిగెత్తుకొచ్చిన ఆయ‌న‌.. 'ఏంటి మీ రిలేష‌న్‌?' అని కంగారుగా అడిగారట. పొరపాటున ఈ విష‌యం మీడియాకు గానీ తెలిస్తే.. అదికాస్తా జ‌నాల్లోకి వెళ్తే.. నా సినిమా ఏమై పోవాలి? అని అన్నార‌ట‌!

ఈ విష‌యాన్ని తాజాగా ''ఆలీతో స‌ర‌దాగా'' కార్యక్రమంలో షేర్ చేసుకున్నారు సదా. ఆ చిత్రంతోపాటు త‌న ఫ‌స్ట్ మూవీ జ‌యం నాటి సంగ‌తులు కూడా చెబుతూ న‌వ్వుకున్నారు.
Tags:    

Similar News