నటి ఇష్యూలో వర్మ ఎందుకు ఓపెన్ కావట్లేదు?

Update: 2017-02-21 07:27 GMT
ప్రపంచంలో ఎక్కడేం జరిగినా.. వెనువెంటనే స్పందించే కొద్దిమంది సినీ ప్రముఖుల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకరు. ఇక.. నేర సంబంధమైన అంశాలు చోటు చేసుకుంటే వెంటనే తనకున్న విస్తృతమైన నెట్ వర్క్ ను యాక్టివ్ చేసి.. సమాచారసేకరణ స్టార్ట్ చేస్తారని చెబుతారు. దీనికి తగ్గట్లే ట్విట్టర్ లో ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. మొన్నటికి మొన్న జయలలిత.. శశికళ ఎపిసోడ్ నే తీసుకుంటే.. అమ్మకు.. చిన్నమ్మకు మద్యనున్న రిలేషన్ గురించి తాను విస్మయకర అంశాల్ని తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ఏదైనా సంచలన సంఘటన చోటు చేసుకుంటే.. దాన్ని సినిమా చేస్తానని ప్రకటించటం వర్మకు అలవాటు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ.. సిత్రంగా.. కేరళలో జరిగిన హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల ఇష్యూ మీద ఇంతవరకూ స్పందించకపోవటం గమనార్హం. నటి పట్ల దారుణంగా వ్యవహరించిన వైనంపై సంచలన అంశాలు వరుసగా తెర మీదకు వస్తున్న వేళ.. వర్మ సైలెంట్ గా ఉండిపోవటం గమనార్హం.

నటికి ఎదురైన దారుణం పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఖండించటం.. ఆమెకు అండగా ఉంటామని చెప్పటం తెలిసిందే. అదే సమయంలో.. ఈ ఇష్యూ మీద దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ ఉదంతం వెనుక పలువురు ప్రముఖుల హస్తం ఉందని అనుమానిస్తున్న వేళ.. తనకున్న నెట్ వర్క్ తో వర్మ సమాచారం సేకరించలేదా? ఒకవేళ సేకరించి ఉంటే.. ఎందుకింకా ట్వీట్ చేయలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అన్ని అంశాల మీద స్పందించే.. వర్మ సినీ పరిశ్రమకు చెందిన ఇంతటి సంచలన అంశం చోటు చేసుకున్నప్పుడు.. రియాక్ట్ కావటం బాగుంటుందేమో..? వీలైతే.. ఆయన సేకరించే బిహైండ్ స్క్రీన్ సమాచారాన్ని పోలీసులకు అందిస్తే.. నిందితులకు కఠినశిక్షలు పడే అవకాశం ఉంటుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News