రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో తన పార్ట్ పూర్తి కాగానే ఆచార్య చిత్రీకరణలో జాయిన్ కావాల్సి ఉంది. ఏడెనిమిది నెలలుగా కరోనా క్రైసిస్ విలువైన సమయాన్ని హరించివేయడమే గాక షూటింగులు పెండింగ్ లో పడిపోవడానికి కారణమైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సంక్రాంతి తరువాత ఆచార్య సెట్స్ లో చరణ్ చేరనున్నాడు. తన పార్ట్ ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేస్తారని .. చిరంజీవి - చరణ్ కలయికలో ఎపిసోడ్లు కూడా ఈ షెడ్యూల్ లో పూర్తి చేసేస్తారని తెలిసింది.
ఆచార్య షెడ్యూల్ కి ఇబ్బంది కలగ కుండా రాజమౌళితో చరణ్ - చిరంజీవి బృందం చర్చించారని తెలిసింది. ఇప్పటికే చరణ్ తన కాల్షీట్లను ఆచార్య కోసం కేటాయించారు. కొరటాల శివ బృందం షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఆచార్య షెడ్యూల్స్ ఎక్కడ జరుగుతాయి? అంటే.. షూట్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ డిసెంబర్ నుండి ఆచార్య సెట్స్ లో చేరనున్నారు. సమ్మర్ 2021 విడుదలకు సిద్ధం చేస్తారట. ఉద్దేశించబడింది. రామ్ చరణ్ తో కలిసి మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఆచార్య షెడ్యూల్ కి ఇబ్బంది కలగ కుండా రాజమౌళితో చరణ్ - చిరంజీవి బృందం చర్చించారని తెలిసింది. ఇప్పటికే చరణ్ తన కాల్షీట్లను ఆచార్య కోసం కేటాయించారు. కొరటాల శివ బృందం షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఆచార్య షెడ్యూల్స్ ఎక్కడ జరుగుతాయి? అంటే.. షూట్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ డిసెంబర్ నుండి ఆచార్య సెట్స్ లో చేరనున్నారు. సమ్మర్ 2021 విడుదలకు సిద్ధం చేస్తారట. ఉద్దేశించబడింది. రామ్ చరణ్ తో కలిసి మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.