మెగా ఉయ్యాలవాడ కోసం బడా పార్టనర్స్

Update: 2017-05-22 10:10 GMT
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాస్ట్ రోజురోజుకూ పెరుగుతోంది. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్. 150 మంచి హిట్ సాధించి ప్రేక్షకుల్లో మెగాస్టార్ కు ఆదరణ తగ్గలేదని ప్రూవ్ కావడం... బాహుబలి చిత్రం సాధించిన విజయం ఈ చిత్ర యూనిట్ లో కాన్ఫిడెన్స్ బాగా పెంచాయి.

దీంతో ఉయ్యాలవాడ సినిమాను మరింత భారీ బడ్జెట్ తో తీసేందుకు సిద్ధమయ్యాడు చిరంజీవి తనయుడు, ఈ చిత్ర నిర్మాత అయిన రామ్ చరణ్ తేజ్. మెగా ఫ్యామిలీలోనే ఇంతవరకు తీయని విధంగా రూ. 120  కోట్లతో ఈ సినిమా తీస్తామని ముందుగా ప్రకటించినా బాహుబలి విజయం తర్వాత మనసు మార్చుకుని విజువల్ ఎపెక్ట్స్ - సెట్లలో ఏ మాత్రం రాజీ పడకుండా మరింత భారీగా సినిమా తీయాలని డిసైడైపోయాడు.

రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా తెలుగులోనే తీయాలని భావించారు. ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, మళయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు. బడ్జెట్ పెరిగినందున తమిళ వెర్షన్ కు సంబధించి లైకా ప్రొడక్షన్స్ ను పార్టనర్స్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో వీరు ఖైదీ నెం 150 సినిమాలో కూడా వీరు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ వారు ప్రస్తుతం రూ. 400 కోట్ల బడ్జెట్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమా నిర్మిస్తున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి అన్ని బాధ్యతలు రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక నిపుణులను ప్రత్యేకంగా ఎంపిక చేసి తెచ్చుకుంటున్నారు. కెమెరామెన్ గా బాలీవుడ్ కు చెందిన రవివర్మన్ ను ఎంపిక చేశారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా  సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
Tags:    

Similar News