బోయపాటిని కన్ఫ్యూజ్ చేస్తున్న చెర్రీ

Update: 2017-11-20 13:30 GMT
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక కథ అనుకుంటే అది తిసేవరకు మరో కథ జోలికి వెళ్లాడట. కథలో మంచి మాస్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీన్స్ ను సిద్ధం చేసుకొని అది పక్కన పెడితే మళ్లీ ఆ కథ మీద ప్రేమ తక్కువవుతుందని ఓ కమిట్మెంట్ తో ఉంటాడని టాలీవుడ్ లో టాక్ ఉంది. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు చాలా వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఏ దర్శకుడికైనా ఒక సినిమా పట్టాలెక్కేంత వరకు క్లారిటీ ఉండదు.

బోయపాటి ఒకే సరి మూడు కథలను రెడీ చేసుకొని హీరోలకు చెప్పి ఒకే చేయించుకున్నాడు కూడా.. అయితే ఇప్పుడు ఆ స్టార్స్ డేట్స్ వల్ల అసలు ఏ సినిమా మొదలు పెట్టాలో తెలియక సతమతమవుతున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది. అసలైతే బోయపాటి నెక్స్ట్ సినిమా చరణ్ తో తీస్తాడని వార్తలొచ్చాయి. కానీ రీసెంట్ గా చెర్రీ రాజమౌళి చెప్పిన కథకు ఒకే చేశాడని మరికొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బోయపాటి వెంటనే బాలయ్య తో కూడా ఓ సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడట.

ఇక మహేష్ తో మరో సినిమా చేయ్యాలని ఆయన కోసం స్టోరీని కూడా రెడీ చేశాడని సమాచారం. కానీ ప్రస్తుతం బాలయ్య - మహేష్ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ మాత్రం రంగస్థలం 1985 అయిపోగానే ఖాళీ అవుతాడు. ఆ సమయాన్ని బోయపాటి వాడుకోవాలని చూస్తున్నాడు. ఫస్ట్ చెర్రీతో సినిమా చేస్తే ఒక పనైపోతుందని వెయిట్ చేస్తున్నాడట. మరి చెర్రీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.   
Tags:    

Similar News