బ్రహ్మోత్సవం ఫ్లాప్.. రకుల్ ఖుషీ

Update: 2017-02-22 07:02 GMT
సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లు అన్నీ ఓపెన్ గా మాట్లాడేస్తామంటే కుదరు. సాధ్యమైనంత వరకు దాపరికం పాటించాలి. కొన్ని విషయాలపై వ్యూహాత్మక మౌనం పాటించాలి. అలా కాకుండా అన్నింటి మీదా ఓపెన్ గా మాట్లాడేస్తామంటే కుదరదు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంలో నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది. తాను మిస్సయిన సినిమాలు ఫ్లాప్ కావడం గురించి ఆమె ఖుషీ అయిపోతోంది. ఆ సినిమాల పేర్లు చెప్పకపోయినా బాగుండేది. కానీ ఆ సినిమాలేవో కూడా క్లారిటీ ఇచ్చేసి.. అవి మిస్సయినందుకు హ్యాపీ అంటోంది.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు సరసన మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే దీని కంటే ముందే ఆమె ‘బ్రహ్మోత్సవం’లో మహేష్ తో జోడీ కట్టాల్సింది. మరోవైపు రకుల్.. నాగచైతన్య సరసన ఓ సినిమా చేస్తోంది. దీని కంటే ముందు ‘ఆటోనగర్ సూర్య’లోనే చైతూ సరసన నటించాల్సింది. డేట్ల సమస్య వల్ల అవి రెండూ మిస్సయింది రకుల్. ఐతే ఆ రెండు సినిమాలూ డిజాస్టర్లయ్యాయి. వీటిపై స్పందిస్తూ.. ‘‘ఏదైనా మన మంచికే అనుకుంటా. నేను బ్రహ్మోత్సవం.. ఆటోనగర్ సూర్య సినిమాలు మిస్సయ్యాయి. ఆ అవకాశాలు కోల్పోయినపుడు ఒక్క రోజు మాత్రమే బాధపడ్డా. నేను మిస్సయిన సినిమాలు ఆడకపోయేసరికి హమ్మయ్య అనుకున్నా. నేను మిస్సయిన హీరోలతో మళ్లీ అవకాశాలు అందుకోవడం  సంతోషంగా ఉంది’’ అని రకుల్ తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News