రజినీ.. ఆల్ ఈజ్ వెల్ అంటున్నారే

Update: 2016-10-21 15:34 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో సూపర్ స్టార్ ఇలా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీ.. దానికి బ్రేక్ వేసి మరీ హడావిడిగా యూఎస్ వెళ్లడంతో చాలానే రూమర్స్ వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం కబాలి ఫినిష్ చేసిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది.

ఈ ఏడాది సమ్మర్ చివర్లో అమెరికా వెళ్లిన ఆయన.. కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నారు. చివరకు కబాలి డబ్బింగ్ పనులను కూడా అక్కడి నుంచే పూర్తి చేశారనే టాక్ ఉంది. ఆ తర్వాత రికవర్ అయ్యి ఇండియా వచ్చిన ఆయన.. తన ఆరోగ్యంపై వచ్చిన భయాలకు ఇన్ డైరెక్టుగా ఆన్సర్ ఇచ్చారు. అయితే.. మళ్లీ నెలల వ్యవధిలోనే అమెరికా వెళ్లడం.. అది కూడా అనారోగయ్ సమస్యల కారణంగానే అనడంతో.. అబిమానుల్లో భయాలు మొదలైపోయాయి. కానీ పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదని.. ఇది ఆయన ఏజ్ కారణంగా రెగ్యులర్ చెకప్ మాత్రమేనని అంటున్నారు రజినీ ఫ్యామిలీ మెంబర్స్.

గతంలో చేయించుకున్న పరీక్షలు.. తీసుకున్న చ చికిత్సల సమయంలోనే.. ఇప్పటి చెకప్ ల గురించి కూడా తెలసట. అలాగే.. ఆయన మరో వారంలో ఇండియా వచ్చేస్తారని తెలుస్తోంది. దీపావళి పండుగను సూపర్ స్టార్ ఇండియాలోనే సొంతింటిలో జరుపుకోనున్నారన్నది.. రజినీ అభిమానులకు కచ్చితంగా గుడ్ న్యూసే.
Tags:    

Similar News