ఏంటీ ఇలా కాల్చుకు తినేస్తోంది.. జాలి లేదా?

Update: 2020-07-13 05:30 GMT
``మనం అంద‌రం డిస్కవరీ ఛానల్ చూస్తాం.. పులి లేడిని వెంటాడుతూ ఉంటుం‌ది... విజువల్స్ చూస్తూ ఈ భూమ్మీద ఉన్న ప్రతి మనిషీ లేడి తప్పించుకోవాలి అని దేవుడికి మొక్కుకుంటారు. లేడి తప్పించుకోగానే అనందంతో క్లాప్స్ కొడతారు... కానీ కోడిని కొసుకోని బిర్యానీ తినేస్తారు!! వీళ్ల‌కి ఆ కోడి మీద కానీ.. లేడి మీద కానీ జాలి ఉండ‌దు. ఆ పులి మీద కోపం.. దాన్ని ఏమీ పీక‌లేక‌.. జాలి కరుణ అని కబుర్లు చెప్తారు..మనుషులు కదా! అందుకే మానవత్వం గురుంచి మట్లాడుతారు``..ఇదీ బిజినెస్ మ్యాన్ డైలాగ్.

బాలీవుడ్ క‌థానాయిక రాధిక ఆప్టే కూడా చేస్తున్న‌ది అదే. మూగ జీవాలు ప్రాణులు అంటూ అప్పుడ‌ప్పుడు అయినా గుర్తు చేసుకునే ఈ అమ్మ‌డు.. ఇప్పుడేమిటిలా చేప‌ను కాల్చుకుని తినేయ‌డానికి రెడీ అవుతోంది?  పైగా ఎంత రుచిక‌ర‌మైన డిస్సో అంటూ న‌వ్వులు చిందిస్తూ ఆ ఫోజేమిటి?  ప‌చ్చి చేప‌ల్ని ఇలా బొగ్గుల కుంప‌టిపై వండి నిమ్మ‌కాయ పిండుకు తినేస్తుందా? అయినా ఇదేం ప‌ని?  జాలి అన్న‌దే లేదా?

రాధిక ఆప్టే.. `ర‌క్త చ‌రిత్ర`లో క‌థానాయిక‌గా న‌టించింది. బాల‌య్య స‌ర‌స‌న లెజెండ్ లోనూ నాయిక‌గా ఆడిపాడింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ కే అంకిత‌మైన సంగ‌తి తెలిసిందే. రాధిక ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. లేటెస్టుగా ఈ ఫోటో చూశాక `బిజినెస్ మేన్` డైలాగ్ గుర్తుకు రావ‌డం లేదూ?
Tags:    

Similar News