కంట్రోల్ కంట్రోల్ అంటున్న నిర్మాత...!

Update: 2018-12-11 12:11 GMT
స్టార్ హీరోలతో సినిమాలు తీసే ఫిలిం మేకర్స్ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ఫ్యాన్స్ కోసం తరచుగా అప్ డేట్స్ ఇస్తుండాలి. లేకపోతే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాకు అప్డేట్ స్ కావాలని హంగామా మొదలు పెడతారు.  'సాహో' అప్డేట్స్ రావడం లేదని గతంలో ప్రభాస్ ఫాన్స్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక అలాంటి పరిస్థితే తమిళ నాట సూర్య ఫ్యాన్స్ విషయం లో కూడా ఎదురైంది 'ఎన్ జీ కె' నిర్మాతలకు.
 
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య 'ఎన్ జీ కె'(నంద గోపాలన్ కుమరన్) అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ సినిమాకు సంబంధించిన ప్రచారం ఏమీ మొదలుపెట్టలేదు.. దీంతో సూర్య ఫ్యాన్స్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడు?.. టీజర్ ఎప్పుడు?.. అంటూ ట్విట్టర్ లో ఈ సినిమా మేకర్స్ ను అడగడం మొదలు పెట్టారు.  మాకు అప్ డేట్స్ కావాలంటూ అదేపనిగా మెసేజిలు పెట్టడంతో 'ఎన్ జీ కె' నిర్మాత ఎస్. ఆర్. ప్రభు స్పందించాల్సి వచ్చింది.  ట్విట్టర్ ద్వారా "హాయ్ గైస్.. మీరందరూ సూర్య అన్న #ఎన్ జీ కె గురించి చాలా ఆసక్తిగా ఉన్నారని మాకు తెలుసు.  మేము బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాం.  రిలీజ్ వరకూ ఎగ్జైట్మెంట్ ను కంట్రోల్ చేసుకుందాం.  ప్లీజ్.. కంటెంట్ ఏదీ లీక్ చెయ్యొద్దు" అని ట్వీట్ చేశాడు.

ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు.. శరత్ కుమార్.. సంపత్ రాజ్.. మురళి శర్మ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
Tags:    

Similar News