ఆగష్టులో ప్రభాస్ ప్రేమకథ మొదలు!

Update: 2018-07-22 10:17 GMT
ప్రభాస్ తెలుగువారికే కాకుండా దేశంలో ఉన్న సినీ ప్రేమికులందరికీ ఒక ఫేవరేట్ హీరో అయ్యాడు. దానికి కారణం రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమానే.  ప్రభాస్ దేశంలో జనాలందరికీ ఇప్పుడొక డార్లింగ్. దాంతో ప్రభాస్ నెక్స్ట్ ఫిలిం 'సాహో' పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ఆ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.  ఇంతలో ప్రభాస్ 'సాహో' తర్వాత నటించబోయే మరో సినిమా గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

'సాహో' తర్వాత ప్రభాస్ ఒక రొమాంటిక్ లవ్ స్టొరీ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం తెలిసిందే.   'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమా 1940-50 నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని టాక్. ఈ సినిమాను ఆగష్టు మొదటి వారంలో లాంచ్ చేసేందుకు ముహూర్తం కుదిరిందట.  ఈ సినిమాలో ఎక్కువభాగాన్ని యూరోప్ లో తెరకెక్కిస్తారట.  UV క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేశారట.

ఇతర నటీనటులు.. టెక్నిషియన్ల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.  ప్రస్తుతం ప్రభాస్ కున్న ఇమేజ్ ని బట్టి చూస్తే ఈ సినిమాను కూడా 'సాహో' తరహాలోనే భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తారనే అంచనాలున్నాయి.


Tags:    

Similar News