ఖిలాడీ మాస్ రాజా కోసం పోటుగాడు?

Update: 2021-04-12 00:30 GMT
మాస్ మ‌హారాజా ర‌వితేజ క్రాక్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని వెంట‌నే ఖిలాడీ చిత్రీక‌ర‌ణ‌లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చేస్తుండ‌గానే బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నారు. ఇప్పటికే ఖిలాడీ చిత్రీక‌ర‌ణ మెజారిటీ భాగం పూర్త‌యింది. త‌దుప‌రి త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తారు.  ఇది మాస్ యాక్షన్ ఎంటర్ టైన‌ర్. ఆ త‌ర్వాత కూడా మ‌రో ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌.

మాస్ మహారాజ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌ శరత్ మండ‌వ‌తో క‌లుస్తున్నారు. అత‌డు వినిపించిన‌ స్క్రిప్ట్ ను ఓకే చేసారు. 2016 తమిళ థ్రిల్లర్ KO2 కి దర్శకత్వం వహించిన శ‌ర‌త్ మంచు మనోజ్ పోటుగాడుకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశారు. ప్రస్తుతం విరాఠ‌ పర్వం నిర్మిస్తున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి రవితేజ-శరత్ మండవ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటికి రానున్నాయి.
Tags:    

Similar News