బుట్ట‌బొమ్మ నాభి మ‌డ‌త‌లు.. ఫిట్ లుక్ కి ప‌రేషానే

Update: 2021-02-19 14:30 GMT
టాలీవుడ్ బాలీవుడ్ లో సునామీ స్పీడ్ తో సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ భామ‌ క్ష‌ణం తీరిక లేకుండా వృత్తిలో బిజీగా గ‌డుపుతోంది.

ఇటీవ‌లే బాలీవుడ్ లో ఓ రెండు కొత్త సినిమాల్ని ఖాయం చేసుకుంద‌నేది తాజా గుస‌గుస‌. టాలీవుడ్ లో రాధేశ్యామ్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌వుతున్న‌ క్ర‌మంలోనే బాలీవుడ్ సినిమాల‌కు సంత‌కాలు చేసింద‌ని తెలిసింది. మ‌రోవైపు ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా క‌నిపించ‌నుంది. ఇక్క‌డ షెడ్యూళ్ల‌ను మ్యానేజ్ చేస్తూనే అటు ముంబై ప‌రిశ్ర‌మ‌లోనూ కెరీర్ ని తెలివిగా ప్లాన్ చేస్తోంది.

ప‌నిలో ప‌నిగా ఇన్ స్టా అభిమానుల‌ను అస్స‌లు విడిచిపెట్ట‌డం లేదు ఈ అమ్మ‌డు. నిరంత‌రం ఏదో ఒక వేడెక్కించే ఫోటో లేదా వీడియోని షేర్ చేస్తూ యంగేజ్ చేస్తోంది. నిన్న‌నే రెడీ ఫ‌ర్ టేకాఫ్ అంటూ విమాన యానానికి ప్ర‌చారం చేసింది. విమానాలు ఎగురుతున్న డిజైన‌ర్ రెడ్ కోట్ ని ధ‌రించి బోలెడంత ప్ర‌చారం చేసింది. హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయిన‌ప్ప‌టి ఫోటో వైర‌ల్ అయ్యింది. అయితే తాను ముంబై నుంచి బ‌య‌ల్దేరింద‌ని భావించిన ఓ అభిమాని డ‌స్కీ బ్యూటీ హైద‌రాబాద్ కి విమానంలో రావాల‌ని కోరాడు.

మొత్తానికి పూజా హైద‌రాబాద్ లోనే అందుబాటులోకి వ‌చ్చింది. అన్న‌ట్టు పూజా హెగ్డే షేర్ చేసిన తాజా ఫోటో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇదిగో ఇలా నాభి కేంద్రాన్ని ఎలివేట్ చేస్తూ పూజా ఇచ్చిన ఫోజు చూశారు క‌దా?  యువ‌ర్ యారో బ్రిడ్జ్.. మై బ్యాలెట్ మూవ్ మెంట్! అన్న వ్యాఖ్య‌ను ఈ ఫోటోకి జోడించింది పూజా. త‌న ఫిట్టెస్ట్ లుక్ ఒంపు సొంపులు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ ఇప్పుడు.
Tags:    

Similar News