170 మిలియ‌న్ల‌‌ వ్యూస్ తో ర‌ష్మిక సాంగ్ దుమారం

Update: 2020-12-04 01:30 GMT
యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు ధృవ్ స‌ర్జా లేటెస్ట్ మూవీ తెలుగు చిత్ర‌సీమ‌లోనూ హాట్ టాపిక్ గా మారింది. ధృవ్ న‌టించిన క‌న్న‌డ చిత్రం `పొగ‌రు` మూవీ సాంగ్ తెలుగులోనూ ఓ ఊపు ఊపేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట‌లో ధృవ్ స‌ర్జా.. ర‌ష్మిక మంద‌న్న టాప్‌ లేపేశారు. ``క‌రాబు మైండ్‌.. మెరిసే క‌రాబు .. చేస్తావా రుబాబు ..` అంటూ ఇటీవ‌ల విడుద‌ల చేసిన `పొగ‌రు` మూవీ పాట యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించింది. క‌న్న‌డ‌లో మిలియన్ల క‌ద్దీ వ్యూస్ ‌తో రికార్డులు సాధిస్తోంది.

నంద‌కిషోర్ డైరెక్ట్ చేసిన `పొగ‌రు` చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ ఏర్ప‌డింది. ఈ పోటీలో ముందు వ‌రుస‌లో నిలిచి వైజాగ్ ప్రొడ్యూస‌ర్,... ఫైనాన్షియ‌ర్... ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ డి. ప్ర‌తాప్ రాజు సొంతం చేసుకున్నారు. రైట్స్ కోసం 3 కోట్ల 30 ల‌క్ష‌లు చెల్లించారు. సాయి సూర్యా ఎంట‌ర్ ‌టైన్ ‌మెంట్స్ బ్యాన‌ర్ పై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగు టైటిల్ ‌ని మాత్రం మారుస్తున్నార‌ట‌.

క‌న్న‌డ‌.. తెలుగు భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని క‌న్న‌డ‌లో `పొగ‌రు` టైటిల్ వినిపిస్తున్నా.. తెలుగులో మాత్రం మ‌రో టైటిల్ తో రిలీజ్ చేయాల‌నుకుంటున్నామ‌ని నిర్మాత డి. ప్ర‌తాప్ రాజు తెలిపారు. ఇటీవ‌ల విడుద‌లైన `పొగ‌రు` క‌న్న‌డ సాంగ్ యూట్యూబ్ ‌లో 170 మిలియ‌న్ ‌ల‌కు పైగా వ్యూస్ ని సాధించి రికార్డు సృష్టించింది. ఇదే తెలుగు పాట‌కు ఇప్ప‌టికి 43 మిలియ‌న్ ల వ్యూస్ వ‌చ్చాయి. దీంతో ఈ మూవీ తెలుగు రైట్స్ కు భారీ పోటీ ఏర్ప‌డింది. అంద‌రిని అధిగ‌మించి ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న డి. ప్ర‌తాప్ ‌రాజు తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News